Guntur Kaaram: సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘గుంటూరు కారం’ మూవీ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. జనవరి 12న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్కు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీకి రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ సంక్రాంతికి రిలీజ్ అయిన మహేశ్ బాబు అన్ని సినిమాల కంటే గుంటూరు కారం చిత్రం అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.
ఏరియాల వారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు:
నైజాం – 42 కోట్లు,
సీడెడ్ – 14 కోట్లు,
ఉత్తరాంధ్ర- 14.5 కోట్లు,
తూర్పు గోదావరి- 8.8 కోట్లు,
గుంటూరు – 7.8 కోట్లు,
పశ్చిమ గోదావరి – 6.5 కోట్లు,
కృష్ణా – 6.5 కోట్లు,
నెల్లూరు – 4 కోట్లు,
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 104.1 కోట్ల వరకు ఈ మూవీ బిజినెస్ జరిగింది.
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 9.5 కోట్లు, ఓవర్సీస్ రూ.21 కోట్లకు ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఇక అన్ని ఏరియాల్లో కలిపి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే రూ.134.6 కోట్లు. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.135 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంటుంది.