Guntur Kaaram: సూపర్ స్టార్ మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘గుంటూరు కారం’ మూవీ భారీ హైప్తో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అందరి అంచనాలను పెంచేసిన సంగతి తెలిసిందే. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ హంగామా స్టార్ట్ అయింది. ఈ తరుణంలో నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తన మాస్ స్ట్రాటజీతో సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఇతర సినిమాల మేకర్స్కు దిమ్మతిరిగే ప్లాన్తో ఆశ్చర్యపరిచారు.
‘గుంటూరు కారం’ మూవీ నైజాం డిస్ట్రిబ్యూషన్ బాధ్యతను తన చేతుల్లోకి తీసుకున్న దిల్ రాజు.. మొదటి రోజునే ఈ మూవీ అత్యధిక థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాదులో మొత్తంగా 96 సింగల్ స్క్రీన్స్ ఉండగా.. అందులో 90 కి పైగా సింగల్ స్క్రీన్లలో ‘గుంటూరు కారం’ మూవీనే రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు. మిగిలిన నాలుగైదు థియేటర్లలో ఆరోజు రాబోతున్న మిగతా సినిమాలు విడుదల కాబోతున్నాయి. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఇంత భారీ స్థాయిలో థియేటర్స్ను దక్కించుకున్న ఏకైక మూవీ ‘గుంటూరు కారం’ అని తెలుస్తోంది.
జనవరి 12న ‘గుంటూరు కారం’తో పాటు ‘హనుమాన్’ తదితర సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే జనవరి 13, 14 తేదీల్లో కూడా పలు సినిమాలు వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. దీంతో మొదటి రోజే వీలైనన్ని ఎక్కువ కలెక్షన్లు రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.