Viswam Teaser: మ్యాచో స్టార్ గోపీచంద్ ఒక మంచి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగా వరుస సినిమాలు చేస్తున్నాడు. అయినా ఏ ఒక్క సినిమా కూడా ఆయన్ను కంబ్యాక్ చేయలేకపోయింది. గతేడాది రెండు మూడు సినిమాలు చేసాడు. కానీ ఏవీ పెద్దగా అలరించలేకపోయాయి. ఇక ఈ సారి గోపిచంద్ గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉన్నాడు. ఇప్పుడు ఓ పవర్ ఫుల్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అదే ‘విశ్వం’. ఇందులో గోపిచంద్కు జోడీగా కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తుంది.
ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు అంచనాలు పెంచేశాయి. అంతేకాకుండా ఇది వరకు విడుదలైన టీజర్ సైతం ప్రేక్షకాభిమానుల్లో హైప్ పెంచేసింది. ఇక ఇప్పుడు మేకర్స్ మరో అప్డేట్ అందించారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్ ఆదత్యం అత్యంత ఆసక్తికరంగా ఉంది. టీజర్ మొత్తంలో సగం కామెడీ సన్నివేశాలు, మిగతా సగం యాక్షన్ చూపించి మేకర్స్ అదరగొట్టేశారు.
ఇక ఈ టీజర్ ప్రకారం.. ఇంతకీ సంబంధం అమ్మాయికా.. అబ్బాయికా అని అడుగగా.. బగ్గిన్ పండు లాంటి మా అమ్మాయికి, కలక్టర్ కాయలాంటి కుర్రోడిని నువ్వే వెతికి పెట్టాలి అనే డైలాగ్తో ఈ టీజర్ మొదలైంది. ఆ తర్వాత నీకు ఎలాంటి వాడు కావాలి తల్లి అని హీరోయిన్ను అడుగగా.. కనపడగానే నా మీద పడిపోవాలి, నైటంతా మెలుకువగా ఉండాలి అని హీరోయిన్ చెప్పే డైలాగ్ చూస్తుంటే ఆమెకు తమ తల్లిదండ్రులు ఒక మంచి కుర్రాడిని చూస్తున్నట్లు అర్థం అవుతుంది. అదే సమయంలో ఆమె ఈ మాటలు ఆడినట్లు టీజర్ ద్వారా అర్థం అవుతుంది.
Also Read: గోపీచంద్- శ్రీను వైట్ల సినిమా టైటిల్ టీజర్ వచ్చేసింది!
ఆ తర్వాత వెన్నెల కిషోర్ ఎంట్రీ నవ్వులే నవ్వుల్ అని చెప్పాలి. వచ్చాసాడు అని వెన్నెల కిషోర్ చెప్పగానే గోపీచంద్ ఎంట్రీ డప్పుల మేలాలతో అదరిపోయింది. ఆ తర్వాత హీరో హీరోయిన్ రొమాంటి సాంగ్ చూడ్డానికి ముచ్చటగా ఉంది. అయితే ఈ మూవీలో గోపీచంద్కు వాళ్ల నాన్న అంటే చాలా ఇష్టం. అయితే కొన్ని స్విచ్వేషన్లో గోపీచంద్ కొందరిని కలవగా.. వాళ్లు గోపీచంద్ను పోరా నీ యబ్బ అంటూ తిడతారు. దీంతో గోపీచంద్కు కోపం వచ్చి వాళ్లను కొడతాడు. ఆ తర్వాత సునీల్, రామకృష్ణ, శకళక శంకర్ తదితర నటులు తమ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ మొదటిగా హీరోను మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఆ తర్వాత కామెడీ సీన్లు మొత్తం ట్రైన్లో జరిగాయి. ఈ సీన్లు చూస్తుంటే రవితేజ ‘వెంకీ’ సినిమా గుర్తుకురాకపోదు. సినిమాలో సగం సన్నివేశాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కామెడీ సీన్లన్నీ థియేటర్లో పండేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇలాంటి కామెడీ సన్నివేశాలు చూసి ప్రేక్షకులకు చాలా బోర్ కొట్టేసింది. మరి ఈ కామెడీ సీన్లు ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ సీన్ల తర్వాత యాక్షన్ మోడ్లోకి తీసుకెళ్లారు. గోపీచంద్ యాక్షన్ ఫైట్లు గూస్ బంప్స్ తెప్పించాయనే చెప్పాలి. మొత్తంగా ఈ టీజర్ క్లాస్ కామెడీ.. మాస్ యాక్షన్తో అదిరిపోయిందనే చెప్పాలి. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా అక్టోబర్ 11న గ్రాండ్గా రిలీజ్ కానుంది