Good News To Pitapuram, Ramcharan Big Gift For Pawan Kalyan: జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్చరణ్ ఊహించని గిఫ్ట్ ఇవ్వనున్నట్లు టాక్. పవన్ను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో అధ్భుతమైన మల్టీ స్పెషాలిటీ హంగులతో అపోలో దవాఖానను నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పేరిట జనరల్ మేనేజర్ రవణం స్వామినాయుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చేశాడు.
అయితే పవన్ కల్యాణ్కు రామ్చరణ్ ఇచ్చిన మాట ప్రకారం.. త్వరలోనే పిఠాపురంలో అపోలో దవాఖానని నిర్మించబోతున్నట్టు వివరాలను రివీల్ చేశారు. ఇందుకోసం రామ్చరణ్, ఉపాసన దంపతులు అక్కడ పదెకరాల ల్యాండ్ని సైతం కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఆయన ఆ విషయం చెప్పగానే అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. అయితే పిఠాపురానికి అపోలో ఆసుపత్రి రాబోతోందని తెలియగానే పవన్ అభిమానులు తమ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాదు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు.
Also Read: ది గోట్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్పై అదిరిపోయే అప్డేట్
ఇక ఎన్నికల టైమ్లో తన మామయ్య పవన్ కోసం ప్రచారం చేసిన వరుణ్ తేజ్ కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎవరూ ఉహించనంతగా అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. ఇప్పుడు అందుకు అపోలో ఆసుపత్రి నిర్మాణంతో బీజం పడబోతోందని అందరూ మాట్లాడుకుంటున్నారు. పిఠాపురంలో అపోలో ఆసుపత్రి అందుబాటులోకి వస్తే గనుక ఆ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు. చూడాలి మరి ఇంక ముందు ముందు ఆ నియోజకవర్గానికి ఏం ఏం పనులు అందుబాటులోకి రారున్నాయో…