Game changer pre-release overseas deal close: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ని సంపాదించుకున్నాడు. అంతేకాదు తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇక రామ్చరణ్ తమిళ దర్శక దిగ్గజం శంకర్ డైరెక్షన్లో రాబోతున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో రామ్చరణ్ సరసన బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ నటిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో వినయ విధేయ రామ మూవీ వచ్చి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. గేమ్ ఛేంజర్ మూవీ గత రెండేళ్ల నుండి రెండు అడుగులు ముందుకు, ఏడు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. తాజాగా ఈ మూవీ డబ్బింగ్ పనులను కంప్లీట్ చేసేందుకు సన్నద్దం అవుతున్నారు. అంతేకాదు ఈ మూవీ యాక్షన్ అండ్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శంకర్. ఇక శంకర్ డైరెక్షన్లో వచ్చిన భారతీయుడు 2 మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో.. ఆ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ మూవీపై పడే ఛాన్స్ ఉంటుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.
ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఓవర్సీస్ డీల్ రైట్స్ని పాస్ ఫిల్మ్ దాదాపుగా రూ. 20 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఈ మూవీ ఓవర్సీస్ సాధించాలంటే మాత్రం 5.1 మిలియన్ డాలర్లు రాబట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఈ మూవీ డిసెంబర్ 20 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ మూవీపై ఏం మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన సరే మంచి కలెక్షన్లను రాబట్టి బాక్సాపీస్ వద్ద రికార్డుల సునామిని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ మూవీలో అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య, సునీల్ వంటి నటీనటులు ఈ మూవీలో నటిస్తుండగా.. ఈ మూవీకి థమన్ బాణీలు అందిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.