G2:పాన్ ఇండియా రేంజ్కు ఎదిగి అందరినీ ఆకట్టుకుంటున్న టాలీవుడ్ హీరోల్లో అడివి శేష్ ఒకరు. మేజర్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఆయన హిట్ 2తో రీసెంట్గా మంచి సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాను హిందీలోనూ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శేష్ మరో పాన్ ఇండియా ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు. శేష్కు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో గూఢచారి ఒకటి. ఈ సినిమాకు సీక్వెల్గా గూఢచారి 2 ఉంటుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే తర్వాత ఉన్న కమిట్మెంట్స్ కారణంగా.. ఈ సీక్వెల్కు సమయం పట్టింది.
తాజాగా శేష్.. పాన్ ఇండియా లెవల్లో గూఢచారి 2ను అనౌన్స్ చేశారు. అయితే సీక్వెల్కు డైరెక్టర్ మారారు. గూఢచారి సినిమాను శశి కిరణ్ తిక్క తెరకెక్కించారు. సీక్వెల్ను కూడా ఆయన డైరెక్ట్ చేస్తారనే అందరూ భావించారు. అయితే ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు డైరెక్టర్ మారారు.G2 పేరుతో తెరకెక్కనున్న గూఢచారి 2 చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్కు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. జనవరి 9న G2 సినిమాకు సంబంధించిన ప్రీ విజన్ వీడియోను ఢిల్లీ, ముంబైలో విడుదల చేయబోతున్నారు.