Rakshith Shetty (celebrity news today) : కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదయ్యింది. తన పాటలను కాపీ చేసి రక్షిత్ తన సినిమాలో పెట్టుకున్నాడని నవీన్ కుమార్ అనే వ్యక్తి కేసు పెట్టాడు. అసలు విషయం ఏంటంటే.. రక్షిత్ శెట్టి హీరోగా బ్యాచిలర్ పార్టీ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించాడు.
ఇక ఈ సినిమాలోని పాటల కోసం ముందుగా MRT మ్యూజిక్ కంపెనీలో పనిచేస్తున్న నవీన్ కుమార్ తో చర్చలు జరిపారు. అనంతరం ఆ చర్చలు విఫలమవడంతో నవీన్ కుమార్ సినిమాలో భాగం కాలేకపోయాడు. అయితే వారి అనుమతి లేకుండా గాలిమాతు, న్యాయ ఎల్లిడి అనే పాటలను సినిమాలో ఉపయోగించారు.
సినిమా రిలీజ్ అయ్యాకా, ఆ సాంగ్స్ కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాయి. ఇక తమ అనుమతి లేకుండా తమ పాటలను సినిమాలో ఎలా ఉపయోగిస్తారని ఆరోపిస్తూ రక్షిత్ శెట్టికి చెందిన పరమవా స్టూడియోస్ పై, అతనిపైన కూడా నవీన్ కేసు పెట్టాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ కేసుపై కానీ, కాపీ ఆరోపణలపై కానీ రక్షిత్ ఇప్పటివరకు నోరు విప్పలేదు.
రక్షిత్ శెట్టి గురించి తెలుగువారికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మాజీ లవర్ గా అతడు తెలుగువారికి సుపరిచితం. ఆ తరువాత తెలుగులో అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ, సప్త సాగరాలు దాటి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రక్షిత్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి ఈ కాపీ ఆరోపణలపై అతడు ఎలా స్పందిస్తాడో చూడాలి.