Director Madan : ‘ఆ నలుగురు’ చిత్రంతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకుని, ‘పెళ్లయిన కొత్తలో’ చిత్రంతో దర్శకుడిగా మారిన మదన్ ఆకస్మిక మరణం చెందారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన మదన్… హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ… కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఈయన స్వస్థలం మదనపల్లి. ‘గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి’… వంటి ఇతర చిత్రాలను ఆయన తెరకెక్కించారు. సూపర్స్టార్ కృష్ణ ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ బాధను మరచిపోక ముందే ఇప్పుడు మదన్ మరణ వార్త అందరినీ దుఃఖ సాగరంలో ముంచేసింది. మదన్ మృతిపై సినీ ఇండస్ట్రీ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.