Karthi Khaidi movie : భాషతో సంబంధం లేకుండా కంటెంట్ కనెక్ట్ అయితే ప్రేక్షకులు చిత్రాలను విపరీతంగా ఆదరిస్తున్నారు. అలా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కి అందించే ఎన్నో చిత్రాలలో కోలీవుడ్ కి సంబంధించిన ఖైదీ చిత్రం ఒకటి. హీరో కార్తీ , డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో విడుదలైన చిత్రం ఖైదీ. కేవలం తమిళ్లోనే కాకుండా ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ గా మారడమే కాకుండా కార్తీ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
2019లో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.నరేన్ , అర్జున్ దాస్ , హరీష్ ఉత్తమన్ , జార్జ్ మరియన్ ,ధీనా ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. బిడ్డ పుట్టక ముందు జైలు పాలై విడుదల తర్వాత కూతుర్ని కలవాలి అని బయలుదేరిన ఖైదీ …విషయం తిన్న పోలీసులను ఆస్పత్రికి తరలించడంలో సహాయపడతాడు. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలియకుండానే డ్రగ్స్ కి సంబంధించిన పెద్ద మాఫియా తో పోలీసులు జరిపే పోరాటంలో పావుగా మారుతాడు.
ఇక ఆ తర్వాత లారీ వెనక విలన్స్ చేజింగ్ దగ్గర నుంచి..కార్తీ వాళ్ళని ఎదుర్కొని పోలీసులను తప్పించడం వరకు ఎక్స్ట్రాడినరీ సన్నివేశాలతో సాగుతుంది. మరి ముఖ్యంగా లాస్ట్ జైల్లో జరిగే ఫైటింగ్ సన్నివేశం అయితే గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీతో కార్తీకి యాక్టర్ గా మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఈ చిత్రం తర్వాత లోకేష్ కనకరాజు తనకంటూ ప్రత్యేకమైన ఒక మల్టీ వర్స్ సృష్టించాడు. అందులో భాగంగా వచ్చిన కనెక్టింగ్ మూవీ విక్రమ్ అయితే రాబోయే కనెక్టింగ్ మూవీ లియో అని టాక్ నడుస్తోంది.
ఎంతో న్యాచురల్ గా సాగే ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. పద్యంలో ఈ చిత్రం నుంచి సీక్వెల్ కోసం ఆడియన్స్, మూవీ లవర్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తర్వాత 2022లో విడుదలైన కమల్ హాసన్ విక్రమ్ చిత్రంలో ఖైదీ సినిమా చూపించకుండానే ఆ చిత్రం గురించి మెన్షన్ చేస్తూ దానికి ఈ మూవీకి మంచి లింక్ క్రియేట్ చేశారు. దాంతో ఈ మూవీ తర్వాత వెంటనే ఖైదీ సీక్వెల్ వస్తుంది అని అప్పట్లో అందరూ అనుకున్నారు. కానీ సీక్వెల్ రావడానికి సమయం ఎక్కువే పడుతుంది.
ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా లోకేష్ ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ను అందించారు. తాను కూడా ఈ మూవీ కోసం ఎప్పటినుంచో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నాను అని.. ప్రస్తుతం రజనీకాంత్ చేస్తున్న మూవీ ఫినిష్ అయిన వెంటనే ఈ చిత్రాన్ని స్టార్ట్ చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం తనకున్న కమిట్మెంట్స్ కారణంగా సీక్వెల్ లేట్ అవుతూ వచ్చిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. పైగా ఈ ఖైదీ మూవీ సిరీస్ తనకు ఎంతో ప్రత్యేకమని.. తన సినిమాకి యూనివర్స్ మొదలైంది అని లోకేష్ అన్నాడు.