Chiranjeevi: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి.. దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురష్కారం పద్మవిభూషణ్కి ఎంపిక కావడంపై ప్రముఖ సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్)లో ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు.
అయోద్య బాల రాముడి దర్శనం అనంతరం మీకు పద్మవిభూషణ్ పురష్కారం వరించడం చాలా సంతోషంగా ఉంది. మీ విషయంలో ఎప్పటికీ గర్వపడుతూనే ఉంటాం అంటూ రాఘవేంద్రరావు తెలిపారు.
అలాగే పునాది రాళ్లు సినిమాతో నటుడిగా తొలి అడుగు వేసిన ఒక సాధారణ కుర్రాడు.. ఇప్పుడు దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. మీ ప్రయాణం ఎన్నో తరాలకు స్ఫూర్తి అంటూ దర్శక ధీరుడు రాజమౌళి అభినందనలు తెలిపారు.
వీరితోపాటు రవితేజ, నాగవంశీ, మంచు విష్ణు, అడివి శేష్, నాని, సంయుక్తా మీనన్, మమ్ముట్టి, మారుతి, ప్రశాంత్ వర్మ, గోపీచంద్ మలినేని, శ్రీ విష్ణు, సంపత్ నందితో పాటు ఆయన కోడలు ఉపాసన కూడా చిరంజీవికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.