RRR : ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సినిమా. ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఆస్కార్ సహా ఎన్నో అవార్డులు వచ్చాయి. తాజాగా ఈ చిత్ర బృందానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ కమిటీలో చోటును కల్పించారు.
ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్తగా ఆస్కార్ కమిటీలో 398 మందికి స్థానం కల్పించింది. ఇందులో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచి ఆరుగురికి అవకాశం దక్కింది. హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్తో , మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ,పాటల రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సిరిల్కు ఈ కమిటీలో చోటు లభించింది.
అలాగే మణిరత్నం, కరణ్జోహార్లను కూడా ఆస్కార్ కమిటీ ఆహ్వానించింది. వచ్చే ఏడాది ఆస్కార్ వేడుకలను మార్చి 10న నిర్వహిస్తారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఆరుగురికి ఆస్కార్ కమిటీలో సభ్యత్వం రావడంపై దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.