Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ – ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. దర్శకుడు అరుణ్ మాతేశ్వర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ పీరియాడిక్ సాలిడ్ యాక్షన్ డ్రామా తమిళ నాట భారీ అంచనాలు నడుమ రిలీజైంది. ఇక ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ టాలీవుడ్లో నెలకొన్న భారీ పోటీ నిమిత్తం మేకర్స్ ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.
ఈ మేరకు లేటెస్ట్గా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా తెలుగులో జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టుగా కొత్త రిలీజ్ డేట్ని వెల్లడించారు. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్, ఆసియన్ డిస్ట్రిబ్యూటర్స్ వారు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ భారీ చిత్రంలో శివ రాజ్ కుమార్, యంగ్ హీరో సందీప్ కిషన్ తదితరులు నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ సంగీతం అందించాడు.