Janhvi Kapoor: అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూతురిగా వెండితెరకు పరచయమైంది నటి జాన్వీ కపూర్. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. అంతేకాకుండా తండ్రి ప్రముఖ నిర్మాత బోనీకపూర్ సూచనలు, సలహాలతో కెరీర్లో స్టార్ కథానాయికగా గుర్తింపు అందుకుంటోంది. ఈ రోజు ఈ అందాల ముద్దుగుమ్మ బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె టాలీవుడ్లో చేస్తున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం ‘దేవర’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ మాస్ అవతార్లో తన సత్తా చాటడానికి రెడీగా ఉన్నాడు. కాగా దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
అలాగే ఇందులో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో ఫస్ట్ పార్ట్ ‘దేవర పార్ట్ 1’. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న విడుదల కాబోతుంది.
READ MORE: రామ్ చరణ్ జోడీగా జాన్వీ.. జాన్వీ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
ఈ విషయాన్ని మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. కాగా ఈ రోజు జాన్వీ కపూర్ బర్త్డే. ఈ సందర్భంగా ఈ మూవీ నుండి జాన్వీకి సంబంధించిన కొత్త పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పేరు ‘తంగం’. ఆమె పేరుతో పాటు నిండైన చీరు కట్టులో ఉన్న ఆమె లుక్ రిలీజ్ చేయగా.. అందరినీ ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఆమెకు సంబంధించిన పోస్టర్స్ నెట్టింట వైరల్గా మారింది. కాగా ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ఈ గ్లింప్స్కి సోషల్ మీడియాలో ఎలాంటి రికార్డులు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
ఇక ఈ సినిమాతో పాటు జాన్వీ మరొక స్టార్ హీరో సరసన హీరోయిన్గా నటించనుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ఆర్సి 16 వర్కింగ్ టైటిల్తో ఓ మూవీ చేయనున్నాడు.
READ MORE: ప్రేమలో పడిపోయా: జాన్వీ కపూర్
ఈ ఆర్సి 16 మూవీకి ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్తో వెంకట సతీష్ కిలారు నిర్మించబోతున్నారు. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా జాన్వీ కపూర్ను మేకర్స్ ఫైనల్ చేశారు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఓ అప్డేట్ అందించారు. ఈ మేరకు జాన్వీ కపూర్ ఈ మూవీలో నటిస్తుందని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఇందులో భాగంగా ఓ పోస్టర్ను వదిలారు.
ఇక ఈ మూవీతో పాటు ఈ ముద్దుగుమ్మ మరో స్టార్ హీరోతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా మూవీ ‘పుష్ప2’. దర్శకుడు సుకుమార్ భారీ రేంజ్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్లో ‘ఊ అంటావా’ అనే టైటిల్ సాంగ్కు సమంత మాస్ స్టెప్పులతో అదరగొట్టిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ ‘పుష్ప2’లో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఐటెం సాంగ్లో దుమ్ము దులిపేస్తుందని అంటున్నారు. ఇందులో ఆమె ఐకాన్ స్టార్తో డ్యాన్స్ ఓ రేంజ్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.