Nutan Naidu: బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, ఉత్తరాంధ్ర కాంగ్రెస్ సీనియర్ నేత సన్యాసి రావు నాయుడు నేటి ఉదయం మరణించారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్సపొందుతూ నేడు మరణించారు. దీంతో పండగ పూట వారి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు భార్య, కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. నూతన్ తండ్రి మృతిపై పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇక నూతన్ నాయుడు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 2 లో ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు ఫేవరేట్ కంటెస్టెంట్ గా మారాడు. కుటుంబం గురించి మాట్లాడొద్దు.. అంటూ ఫైర్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఇప్పటికీ కుటుంబం గురించి ప్రస్తావన వస్తే నూతన్ మీమ్స్ నే వాడుతుంటారు.
ఇక బిగ్ బాస్ లో వచ్చిన గుర్తింపుతో కమెడియన్ గా, విలన్ గా మంచి ఛాన్స్ లు అందుకున్నాడు. ఇక ఆ తరువాత సినిమాలతో పాటు రాజకీయాల్లో రంగప్రవేశం చేశాడు. ఈ మధ్యనే నూతన్ నాయుడు.. కాంగ్రెస్ లో చేరి మరోసారి హాట్ టాపిక్ గా మారాడు.