Bandla Ganesh Check Bounce Case News(Today tollywood news): చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష విధించింది. ఒంగోలు రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనల తర్వాత న్యాయమూర్తి తీర్పును వెలువరించారు.
బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష విధించారు. రూ. 95 లక్షల జరిమానా కూడా విధించారు. కోర్టులో విచారణకు బండ్ల గణేష్ స్వయంగా హాజరయ్యారు. తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు న్యాయస్థానం నెలరోజుల గడువు కూడా ఇచ్చింది.
ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద 2019లో బండ్ల గణేష్ రూ. 95 లక్షలు తీసుకున్నారు. సదరు వ్యక్తికి పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ పేరుతో బండ్ల గణేష్ చెక్కు ఇచ్చారు. అయితే ఈ చెక్ బౌన్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో జెట్టి వెంకటేశ్వర్లు .. బండ్ల గణేష్ పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కోర్టును ఆశ్రయించారు. ఈ చెక్ బౌన్స్ కేసుపై ఒంగోలు రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ చేపట్టారు.