Nandamuri Balakrishna Golden Jubilee celebrations: టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా పరిశ్రమల్లోకి అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరగనున్నాయి.
ఈ వేడుకకు తెలుగు సినిమా పరిశ్రమలోని అతిరథ మహారథులు హాజరుకానున్నారు. తాజాగా, ఈ వేడుకకు హాజరుకావాలని మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. అదే విధంగా నాలుగు సంస్థల పెద్దలతో ముచ్చటించి చేస్తున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకున్నారు.
చిరంజీవిని ఆహ్వానించిన వారిలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫెడరేషన్ నుంచి భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, రాజా రవీంద్ర, జెమినీ కిరణ్, కె,ఎల్. నారాయణ, మాదాల రవి, అనుపమ్ రెడ్డి, నిర్మాత సి కల్యాణ్, డైరెక్టర్ వీర శంకర్, నిర్మాత అశోక్ కుమార్, అనిల్ వల్లభనేని వీర శంకర్ తదితరులు ఉన్నారు.
Also Read: కల్కీ సినిమా బాలేదు.. ప్రభాస్ ఓ జోకర్లా ఉన్నాడు: బాలీవుడ్ యాక్టర్ షాకింగ్ కామెంట్స్
బాలకృష్ణ..‘తాతామ్మకల’ సినిమాతో తెలుగు తెరపై తొలిసారి దర్శనం ఇచ్చారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. ఇటీవల రాజస్థాన్లో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్లో జరగనుంది. ఆగస్టు చివరి వారం నుంచి జరగనున్న ఈ షూటింగ్లో బాలకృష్ణతోపాటు నటీనటులు పాల్గొననున్నారు.