Ayalaan: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అయలాన్’. ఆర్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఒక్క తెలుగు తప్ప మిగతా ప్రాంతాల్లో విడుదలై.. భారీ కలెక్షన్లను రాబట్టింది. తెలుగులో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ సీక్వెల్ ఖరారైంది. ఈ మేరకు కేజేఆర్ స్టూడియోస్, ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ సంస్థలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.
ఇందులో భాగంగా ‘అయలాన్-2’ టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్కే దాదాపు రూ.50 కోట్లు కేటాయించారు. భవిష్యత్తులో ఆ బడ్జెట్ మరింత పెరిగే అవకాశముందని నిర్మాతలు తెలిపారు. అయితే ఈ సీక్వెల్ మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో వారు వెల్లడించలేదు. పార్ట్ 1 కంటే పార్ట్ 2లో వీఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషించనుందని చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల రిలీజైన ‘అయలాన్’ బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.