Viral Music : సంగీతం మనిషికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒత్తిడి నుంచి ఉపసమనాన్ని కలిగిస్తుంది. నేటి ఆధునిక యుగంలో అన్ని వయస్సుల వారు సెల్ ఫోన్ లో పాటలు వింటూ సంగీతాన్ని ఆశ్వాదిస్తున్నారు. ప్రయాణ సమయాల్లో చాలా మందికి పాటలే టైమ్ పాస్. ఆఫీసుకి వెళ్లేటప్పుడు, ఇంటి తిరిగి వచ్చేటప్పుడు ఇలా సంగీతం వింటూ మైండ్ ను ప్రెష్ చేసుకుంటారు ఉద్యోగులు. వృద్ధులు భక్తి పాటలు వింటూ కాలక్షేమం చేస్తూ ఉంటారు. ఇలా అన్ని వయస్సుల వారిని సంగీతం అలరిస్తుంది.
సంగీత ప్రియులను ఆకట్టుకునేందుకు సంగీత దర్శకులు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కొత్తకొత్త సంగీత పరికరాలు ఉపయోగిస్తూ పాటలకు బాణీ కడుతూ ఉంటారు. సినీ సంగీత దర్శకులు ప్రతి సినిమాకు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. హీరోలకు తగ్గట్టుగా బాణీలు కడతారు. క్లాస్ సాంగ్స్ తో ఆకట్టుకుంటారు. మాస్ పాటలతో ఉర్రూత లూగిస్తారు. కొత్త కొత్త బీట్ లతో సంగీత ప్రియులకు కిక్కెకిస్తారు.
ఆ సంగీత కళాకారులు మాత్రం కొత్తగా ఆలోచించారు. వినూత్న ప్రయత్నం చేశారు. ఎలాంటి సంగీత సాధనాలు లేకుండా ట్యూన్ క్రియేట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గణపతి పాటకు ఓ ముగ్గురు సంగీత కళారులు ఇలా డిపరెంట్ గా ట్యూన్ చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం తమ పెదలతో శబ్ధం చేస్తూ ట్యూన్ క్రియేట్ చేశారు. మంచి రిథమ్స్ తో ఆ ట్యూన్ ను హైపిచ్ లో చేయడం విశేషం. ఓ ఛానల్ లో ప్రసారంమైన ఈ కార్యక్రమంలో ప్రేక్షకులు వారి టాలెంట్ కు చప్పట్లు కొడుతూ అభినందించారు. లతా రవి అనే ఫేస్ బుక్ యూజర్ ఈ వీడియో ను రీల్స్ లో పోస్ట్ చేశారు.
ఆ కళాకారులు క్రియేట్ చేసిన మ్యాజికల్ మ్యూజిక్ వీడియోను మీరు చూడాలనుకుంటున్నారా అయితే ఈ కింద లింక్ ఓపెన్ చేసి చూసేయండి..!
Link —–>>> https://www.facebook.com/reel/551854593662575?s=yWDuG2&fs=e&mibextid=Nif5oz