Actress Anjali latest news(Tollywood news in telugu): తెలుగమ్మాయి అంజలి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఈ ఏడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో వేశ్య పాత్రలో కనిపించి మెప్పించిన అంజలి.. తాజాగా బహిష్కరణ అనే వెబ్ సిరీస్ తో అభిమానులను పలకరించింది.
ఇప్పటికే అంజలి పలు వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. ఇక ఇందులో కూడా అంజలి వేశ్యగానే నటించింది. ఈ బోల్డ్ సిరీస్ లో అంజలి ఇంటిమేటేడ్ సీన్స్ లో నటించింది. తాజాగా ఆ ఇంటిమేటెడ్ సీన్స్ గురించి అమ్మడు ఒక ఇంటర్వ్యూలో వివరించింది.
“నా కెరీర్ మొదలు పెట్టినప్పటినుంచే నాకు మంచి పాత్రలు దొరికాయి. నా ప్రతీ సినిమాకు హోమ్ వర్క్ చేస్తాను. అలాగే బహిష్కరణ సిరీస్ కోసం కూడా చేశాను. ఈ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఇందులో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. ఈ సీన్స్ విషయంలో కూడా నేను తగిన జాగ్రత్తలు తీసుకున్నాను.
ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్ చేసే సమయంలో అందరినీ బయటకు పంపి షూట్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ కామెంట్స్ ను నేను పట్టించుకోను. చాలాసార్లు నా పెళ్లి వార్తలు వచ్చాయి. వారు వీరు అంటున్నారని పెళ్లి చేసుకోలేను కదా. నాకు నచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అంజలి మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇకపోతే అంజలి.. రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ లో నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో అంజలి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.