Rashmi Gautham: యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రష్మీ తాతయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 17 న మృతిచెందారు. ఈ విషయాన్ని తాజాగా రష్మీ అభిమానులతో పంచుకుంది. తన తాతయ్య, బామ్మ ఫోటోను షేర్ చేస్తూ.. రష్మీ ఎమోషనల్ అయ్యింది.
“చివరకు వారు స్వర్గలోకంలో కలిశారు. మా తాత నిజమైన స్త్రీవాది. 17 ఆగస్టు 2024, మేము మా తాతకు తుది వీడ్కోలు పలికాము. వారి ఆత్మలు విడదీయరానివి. ఆమె నుండి దూరంగా ఉండటం అతనికి ఎంత కష్టమో మాకు తెలుసు. అతను గత 1:5 సంవత్సరాలలో ప్రతిరోజూ ఆమె గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. మన అవసరాల కోసం వారు మనతోనే ఉండాలని స్వార్థంగా ఆలోచిస్తాం కానీ, ఆయనకు అంతకుమించిన అవసరం బామ్మతో ముడిపడి ఉంది. వారి ప్రేమ నాకు అర్ధమయ్యింది. వారి ప్రేమకు నిదర్శనం ఈ వీడియో” చెప్పుకొచ్చింది.
ఇక ఈ వీడియోలో రష్మీ తాతయ్య.. బామ్మకు నూనె రాస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు.. రష్మీకి ధైర్యం చెప్తున్నారు. ఇకపోతే రష్మీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
జబర్దస్త్ కు యాంకర్ గా పరిచయమై .. సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రస్తుతం ఈటీవీ లో వరుస షోలకు యాంకర్ గా చేస్తూనే ఇంకోపక్క సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తుంది. ముందు ముందు ఈ చిన్నది హీరోయిన్ గా మంచి మంచి సినిమాలను అందిస్తుందేమో చూడాలి.