Allu Sneha Reddy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్తో రకరకాల ఫోటో షూట్ చేసి ఆ ఫొటోలను షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఎంతో ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు. ఇక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా.. హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ ఈమె సొంతం అనే చెప్పాలి. తాజాగా ఈమెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అల్లు స్నేహారెడ్డి మొదటిసారిగా కెమెరా ముందుకి వచ్చారు. అయితే హీరోయిన్గా మాత్రం కాదు. ఒక యాడ్ చేస్తూ తొలిసారి కెమెరా ముందు దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ యాడ్కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. త్వరలోనే తమ హీరో భార్య ఇండస్ట్రీలోకి హీరోయిన్గా దర్శనమివ్వాలని కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఆమె చేసిన యాడ్ విషయానికొస్తే.. కిండర్ బ్రాండ్కి సంబంధించిన కిండర్ ఎస్ చోకో బోన్ క్రిస్పీ ప్రోడక్ట్ను ప్రమోట్ చేస్తూ ఆమె యాడ్ చేశారు. ఈ యాడ్ షూట్లో మరొక చిన్న అబ్బాయి కూడా కనిపించాడు. అయితే అందరూ.. ఈ అబ్బాయి స్థానంలో తమ కొడుకు అయాన్ ఉంటే ఈ యాడ్ మరో రేంజ్లో ఉండేదంటూ కామెంట్లు పెడుతున్నారు.