Allu Sirish about Allu Arjun(Today tollywood news): అల్లు కుటుంబం నుంచి వచ్చిన హీరో అల్లు శిరీష్. అల్లు అర్జున్ తమ్ముడిగా గౌరవం అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇండస్ట్రీలో సపోర్ట్ తో పాటు లక్ కూడా ఉండాలి అని అంటారు. ఎంత సపోర్ట్ ఉన్నా లక్ లేకపోతే కష్టం. అందులో అల్లు శిరీష్ కూడా ఒకడు.
కెరీర్ మొదటినుంచి కూడా శిరీష్ ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. విజయాపజయాలను పక్కనపెట్టి.. మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం బడ్డీ. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో శిరీష్ సరసన గాయత్రీ భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా బడ్డీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అల్లు శిరీష్ ఎన్నో విషయాలను పంచుకున్నాడు. మీ బడ్డీ ఎవరు.. పవన్ కళ్యాణ్, చిరంజీవి గురించి చెప్పండి అన్న ప్రశ్నకు శిరీష్ మాట్లాడుతూ.. ” నా బెస్ట్ బడ్డీ అంటే మా అన్న అల్లు అర్జునే. చిన్నప్పటినుంచి అన్ని అతనితోనే షేర్ చేసుకునేవాడిని. అన్ని విషయాలు ముందు అతనికే చెప్తాను.
ఇక పవన్ కళ్యాణ్ నుంచి మానసిక ధైర్యం నేర్చుకున్నా.. ఆయనకున్న మానసిక ధైర్యం ఎవరికి లేదు. ఇక చిరంజీవి ఎప్పుడు పాజిటివ్ గా ఉంటారు. అందరితోనూ ఎంతో మర్యాదగా మాట్లాడతారు. మా నాన్న అల్లు అరవింద్ ఒక రోబో. ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు. అన్ని పనులు సమయానికి పూర్తి చేయాలనుకుంటారు. ఒక భర్తగా, తండ్రిగా, ఫ్రెండ్ గా, బిజినెస్ మ్యాన్ గా ఏదైనా సరే వందశాతం బాధ్యతగా నిర్వర్తిస్తారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో అల్లు శిరీష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.