Allu Arjun latest news(Celebrity news today): తనదైన స్టైల్ తో యూత్ ఫాలోయింగ్ ను తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్. పాన్ ఇండియా మూవీ పుష్పతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ను సంపాదించాడు. ఐకాన్ స్టార్ గా మారి తన రేంజ్ ను మరింత పెంచుకున్నాడు. సోషల్ మీడియాలో బన్నీ క్రేజే వేరు. కోట్ల మంది ఈ మెగా హీరోను ఫాలో అవుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో మరో రికార్డు క్రియేట్ చేశాడు అల్లు అర్జున్.
ఇటీవల ట్విటర్కు పోటీగా థ్రెడ్స్ యాప్ వచ్చింది. ఈ యాప్లోనూ అల్లు అర్జున్ హవా కొనసాగుతోంది. అతి తక్కువ సమయంలోనే వన్ మిలియన్ ఫాలోవర్స్ను సొంతం చేసుకున్నాడు. ఇండియన్ యాక్టర్స్ లో ఇంత వరకు ఎవరికీ థ్రెడ్స్ లో మిలియన్ ఫాలోవర్స్ లేరు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా బన్నీ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
‘ఎక్కడైనా తగ్గేదేలే’, ‘కలెక్షన్లతోనే కాదు.. సోషల్ మీడియాలోనూ చరిత్ర సృష్టించగలడు’ అంటూ బన్నీ ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2లో నటిస్తున్నాడు. ‘పుష్ప : ది రైజ్’కు కొనసాగింపుగా పుష్ప : ది రూల్ తెరకెక్కుతోంది. షూటింగ్ వేగంగా సాగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ పేరు ట్రెండింగ్లోకి రావడానికి మరో కారణం కూడా ఉందని అంటున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని వైఫ్ సాక్షి ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ అనే మూవీని నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె హైదరాబాద్ వచ్చారు. తాను అల్లు అర్జున్కు వీరాభిమానినని సాక్షి తెలిపారు. బన్నీ నటించిన ప్రతి సినిమాను చూస్తానని చెప్పారు. ఓటీటీ, యూట్యూబ్ ల్లో అల్లు అర్జున్ సినిమాలను చూస్తానని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. దీంతో థ్రెడ్స్ లో అల్లు అర్జున్ కు ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారని అంటున్నారు.