Allu Arjun:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఫ్యాన్స్ ఈ మూమెంట్స్ను ఎంజాయ్ చేస్తుండగానే మరో గుడ్ న్యూస్ను అభిమానులకు అందించారు. అదేంటో తెలుసా!.. యూఏఈ గవర్నమెంట్ అల్లు అర్జున్కి గోల్డెన్ వీసాను అందించింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ యూఏఈ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పారు. కొన్నాళ్ల నుంచి ఇండియాలోని ప్రముఖ నటీనటులు, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను అందిస్తుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్కి గోల్డెన్ వీసాను ఇచ్చింది.
గోల్డెన్ వీసా పొందిన వారు కుటుంబంతో కలిసి దుబాయ్ లేదా ఎమిరేట్స్లో పదేళ్ల వరకు నివసించవచ్చు. అలాగే వంద శాతం ఓనర్ షిప్తో సొంత వ్యాపారాలను కూడా నిర్వహించకోవచ్చు. సాధారణ వ్యక్తులు యూఏఈలో గోల్డెన్ వీసాను పొందాలనుకుంటే కనీసం రూ.21 కోట్ల ఆదాయాన్ని కలిగి ఉండాలి. సెలబ్రిటీలకైతే పాపులారిటీని బట్టి గోల్డెన్ వీసాను అందించవచ్చు. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు గోల్డెన్ వీసా కలిగి ఉన్నారు. దక్షిణాది విషయానికి వస్తే.. మోహన్ లాల్, మమ్ముట్టి, కమల్ హాసన్, విక్రమ్, త్రిష, టొవినో థామస్, పూర్ణ, రామ్ చరణ్ సతీమణి ఉపాసన, కాజల్ అగర్వాల్, దుల్కర్ సల్మాన్, మీనా, విజయ్ సేతుపతి తదితరులు గోల్డెన్ వీసాను పొందారు.