Alekhya Reddy: సినీనటుడు, టీడీపీ నేత తారకరత్న మరణం.. నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయన కన్నుమూసి నెలరోజులు అవుతున్నప్పటికీ ఆయన భార్య అలేఖ్యరెడ్డి మాత్రం తట్టుకోలేకపోతోంది. ఇప్పటికీ ఆయనను తలుచుకుంటూ కుమిలిపోతోంది. తారకరత్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గడిపేస్తోంది.
ఇక బాలకృష్ణ, తారకరత్నల మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. తారకరత్న అంటే ఎంతో ఇష్టం బాలకృష్ణకు. నందమూరి ఫ్యామిలీలో అందరికంటే ఎక్కవగా తారకరత్నను ప్రేమగా చూసుకునేవారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరినప్పుడు సొంత తండ్రిలా పక్కనే ఉండి చూసుకున్నారు. తాజాగా తారకరత్న ఆసుపత్రిలో ఉన్న సమయంలో బాలకృష్ణ చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో అలేఖ్యరెడ్డి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
తన పిల్లలతో బాలకృష్ణ దిగిన ఫొటోకు తారకరత్న ఫోటోను యూడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘‘కష్టసుఖాల్లో మాకు కొండంత అండగా నిలబడిన వ్యక్తి. ఆసుపత్రిలో తండ్రిలా, నీ బెడ్ పక్కనే కూర్చొని నీకోసం పాట పాడినప్పుడు అమ్మలా, నిన్ను నవ్వించడం కోసం జోక్స్ వేస్తూ సరదాగా కనిపించి.. పక్కకు వెళ్లి కన్నీరు పెట్టుకున్నారు. చివరి క్షణం వరకు నీకోసం పరితపించారు. నవ్వు ఇంకొన్నాళ్లు ఉంటే బాగుండేది. నిన్ను చాలా మిస్ అవుతున్నాం’’ అంటా రాసుకొచ్చింది.