సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. సెలబ్రెటీలు ఎంత వేగంగా పెళ్లి చేసుకుంటున్నారో అంతే వేగంగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ వ్యవహారం తారా స్థాయికి చేరింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. ఇందులో టాలీవుడ్ నుంచి ఎందరో సెలబ్రెటీలు ఉన్నారు. అందులో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. నిజానికి చెప్పాలంటే అక్కినేని కుటుంబీకులకు పెళ్లిళ్లు అసలు కలిసి రాలేదని చెప్పవచ్చు. నాగార్జున, నాగచైతన్య, సుమంత్ ఇలా ముగ్గురూ కూడా లవ్ మ్యారేజ్లో ఫెయిల్ అయినవారే.
నాగార్జున.. దగ్గుబాటి లక్ష్మిని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. నాగ చైతన్య పుట్టిన కొంతకాలానికే విడాకులు తీసుకొని అందరినీ ఆశ్చర్య పరిచారు. అయితే విడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నాగార్జున, లక్ష్మీ దంపతులకు నాగచైతన్య పుట్టిన తర్వాత ఆరేళ్ల పాటు కలిసి ఉన్నారు. ఆపై నాగార్జునకు లక్ష్మీకి మధ్య విభేదాలు వచ్చాయట. తన మాటే నెగ్గాలంటూ లక్ష్మీ ప్రవర్తించేదట. అది నచ్చని నాగార్జున విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
మరొక నటుడు సుమంత్.. ఈ హీరో.. హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహమైన అనంతరం ఆమె సుమంత్ని తీసుకొని ఫారెన్లో సెటిల్ అవుదామని ప్రెషర్ పెట్టేదట. దీంతో అది నచ్చక సుమంత్ ఆమెతో విడాకులు తీసుకున్నాడని సమాచారం.
నాగచైతన్య కూడా హీరోయిన్ సమంతతో కొన్నేళ్ల పాటు ప్రేమాయాణం చేసి పెళ్లిచేసుకున్నాడు. అయితే వివాహమైన నాలుగేళ్లకే వీరిద్దరూ విడాకులు బాట పట్టడంతో అందరూ షాక్కి గురయ్యారు. తనని రిస్ట్రిక్ట్ చేసే హక్కు ఎవరికీ లేదంటూ.. తనకు తాను ఎలా ఉండాలో తెలుసంటూ కూడా సమంత వివాహమైన తర్వాత నాగచైతన్యతో గొడవపడేదని సమాచారం . అందుకే నాగచైతన్య కూడా ఈమె నుంచి విడాకులు తీసుకున్నాడని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
ఇక నాగార్జున రెండో కుమారుడు అఖిల్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకోగా అది కూడా క్యాన్సిల్ అయింది. మొత్తానికి చూసుకుంటే అక్కినేని కుటుంబంలో ‘ఇగో’ ల వల్లే వీరు విడాకుల బాట పడుతున్నారని అంతా అనుకుంటున్నారు.