Ajith Kumar to join KGF universe: ప్రశాంత్ నీల్ అండ్ యశ్.. ఈ రెండు పేర్లు వినిపిస్తే ప్రతి ఒక్కరికీ ‘KGF’ మూవీ గుర్తుకొస్తుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ కాంబో మూవీపై మొదట్లో ఎలాంటి అంచనాలు లేవు. కానీ మొదటి షో పడిన తర్వాత ఈ సినిమా పేరు మారుమోగిపోయింది. యావత్ ప్రపంచ సినీ ప్రియులు ఈ చిత్రానికి ఫిదా అయిపోయారు. దీంతో యశ్ ఓవర్ నైట్లో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు పొందాడు. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్కు సెల్యూట్ కొట్టారు. ముఖ్యంగా మాస్ యాక్షన్ సినీ ప్రియుల్లో కేజీఎఫ్ సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో దర్శకుడు కూడా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా మారిపోయాడు.
ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఎన్నో రికార్డులను సైతం కొల్లగొట్టింది. అలాగే ఎవరూ టచ్ చేయని కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీ సీక్వెల్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మరింత గ్రాండ్ లెవెల్లో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కూడా బాక్సాఫీసును మరింత షేక్ చేసింది. ఫస్ట్ పార్టే అనుకుంటే దాని కంటే మరింత ఎక్కువ రెస్పాన్స్ను సెకండ్ పార్ట్ అందుకుంది. దీంతో కేజీఎఫ్ రికార్డులను సీక్వెల్గా వచ్చిన కేజీఎఫ్ 2 బ్రేక్ చేసింది. కలెక్షన్లలో అయినా, టికెట్ల బుకింగ్స్లో అయినా.. మరే ఇతర విషయంలో అయినా కేజీఎఫ్ బద్దలు కొట్టింది.
ఇక ఈ సీక్వెల్ ఎండింగ్లో కూడా మరో పార్ట్ ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. దీంతో కేజీఎఫ్ 3 కోసం సినీ ప్రేక్షకులు ఉత్కఠంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా మేకర్స్ ఇప్పటి వరకు అందించలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘కేజీఎఫ్ 3’ కథ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కొత్త సినిమాకు కనెక్ట్ చేసేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. రజినీ మూవీలో విలన్గా టాలీవుడ్ మన్మథుడు నాగ్..!
అయితే అతడు మరెవరో కాదు అజిత్ కుమార్. ప్రస్తుతం ఈ హీరో ‘విడాముయర్చి’ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ అతడిని కలిసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అజిత్ను మూడేళ్ల సమయం అడిగినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రశాంత్ నీల్.. అజిత్తో రెండు సినిమాలు తీసేందుకు రెడీ అయ్యాడని తెలుస్తోంది. అందులో మొదటి సినిమా సపరేట్ కథతో తెరకెక్కించబోతున్నాడని టాక్. ఈ సినిమా ‘అజిత్ 64’ కావచ్చని అంటున్నారు. ఇది వచ్చే ఏడాది 2025లో స్టార్ట్ అయి 2026లో రిలీజ్ అవుతుందని సమాచారం.
అయితే మరొక సినిమా అజిత్ కెరీర్లో 65 కానీ 66 కానీ కావచ్చని అంటున్నారు. ఈ సెకండ్ మూవీ క్లైమాక్స్ ‘కేజీఎఫ్ 3’కి కనెక్ట్ అయ్యేలా రూపొందుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్లో అజిత్ పాత్ర అన్నింటికంటే చాలా పెద్దదిగా ఉంటుందని తెలుస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే యష్, అజిత్ కుమార్ ‘కెజిఎఫ్ 3’లో స్క్రీన్ స్పేస్ను పంచుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ 2025లో వెలువడే అవకాశం ఉంది.
#PrashanthNeel is set to direct #AjithKumar in two films! The first will be a standalone, while the second will connect into #KGF3 🔥 pic.twitter.com/XtR3LHryvq
— Let's X OTT GLOBAL (@LetsXOtt) July 24, 2024