Actress Nayantara is Enjoyed: అందాల తార, దేశవ్యాప్తంగా అభిమానులున్న ప్రముఖ హీరోయిన్ నయనతారకు సంబంధించిన తాజా వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ఆమె హాయిగా సేద తీరుతూ కనిపిస్తూ ఉంది. గత కొద్ది రోజుల నుంచి నయన తార బిజీ బిజీగా ఉంది. రెస్ట్ లేకుండా షూటింగ్ చేస్తూ వచ్చింది.
అయితే, ప్రస్తుతం ఆమె హాలిడే మూడ్ లో ఉంది. తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు టూర్ కు వెళ్లింది. హాంకాంగ్ వెళ్లి అక్కడ సేద తీరుతుంది. ఓ రిసార్ట్ లో తన పిల్లలతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నది. హాంకాంగ్ లో విహారయాత్ర చేస్తున్న నయనతార, విఘ్నేష్, వారి పిల్లల ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. నయనతార నటించిన తమిళచిత్రం ‘మన్నంగట్టి సీన్స్ 1960’ కు సంబంధించిన సెలబ్రేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు డ్యూడ్ విక్కీ దర్శకత్వం వహించారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో గౌరీ కిషన్, నరేంద్ర ప్రశాంత్, యోగి బాబు, దుదర్శిని కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: బాలయ్య బాబు మందు తాగలేదు.. అవన్నీ గ్రాఫిక్స్ చేశారు: నాగవంశీ
అదేవిధంగా ఓరువన్ 2, టెస్ట్, డియర్ స్టూడెంట్స్ సినిమాలల్లో కూడా నయనతార ప్రాధాన పాత్రను పోషించింది. ఇటు మంచు విష్ణు నిర్మిస్తున్న కన్నప్ప సినిమాలో కూడా ఆమె ప్రధాన పాత్ర పోషించింది. కాగా ‘టెస్ట్’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
M O M M Y #Nayanthara 👀
In Hong-Long vacation with babies ♥️🧿 pic.twitter.com/3RbGm63xis
— Ever & Forever for Nayan 👀💫❤️ (@SathsaraniSew) May 30, 2024