Jani Master : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఒక్కటే మాట వినిపిస్తుంది.. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు.. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ సెలెబ్రేటీలు సైతం స్పందిస్తున్నారు. మాస్టర్ తో వారికి ఉన్న సంబంధం గురించి చెబుతున్నారు. అలాగే కొంతమంది మాత్రం మాస్టర్ బాగోతం ఇదే అంటే కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా జానీ మాస్టర్ కేసు పై సినీ నటి, బీజేపి నేత మాధవిలత స్పందించారు.. జానీ మాస్టర్ వల్ల ఆమె ఎన్నో భాధలు అనుభవించింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడిన ప్రతి మాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో బెయిల్ విషయంలో ఇబ్బందులు ఎదురు కావడంతో పాటు తప్పు చేశాడని ప్రూవ్ అయితే శిక్ష పడే అవకాశాలు కూడా ఉంటాయనే సంగతి తెలిసిందే.. లేడీ కొరియోగ్రాఫర్ ను లైంగికంగా వేధించిన కేసులో జానీ మాస్టర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సినీ నటి మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది.
ఆ వీడియోలో మాధవి లత మాట్లాడుతూ.. 17 సంవత్సరాల వయస్సులోనే జానీ మాస్టర్ తో 6 నెలల పాటు రిలేషన్ షిప్ లో ఉందని మాధవీలత చెప్పుకొచ్చారు. ఆ తర్వాత బయటికొచ్చి తన పని తాను చేసుకుంటోందని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు ఆమె వయసు 22 ఏళ్లు.. పుష్ప ది రూల్ మూవీ షూట్ లో బాధితురాలు ఉన్న సమయంలో జానీ మాస్టర్ గొడవ చేయడం వల్ల సుకుమార్ పంచాయితీ పెట్టారని విశ్వక్ సేన్ మూవీ షూట్ సమయంలో జానీ మాస్టర్ ఆమెను కొట్టారని మాధవీలత పేర్కొన్నారు.. అలాగే విశ్వక్ సేన్ సినిమా షూటింగ్ లో కూడా ఆమె ఉండగా జానీ మాస్టర్ వచ్చి కొట్టినట్లు వీడియో ప్రూఫ్ లను పోలీసులకు సబ్మిడ్ చేసిందని ఆమె అన్నారు.
ఇకపోతే ఈ కేసుకు సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి . జానీ మాస్టర్ వివాదం విషయంలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటూ ఉండటం గమనార్హం. కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో జానీ మాస్టర్ విచారణలో ఏం చెబుతారనేది ఆసక్తిగా మారింది. ఇక జానీ మాస్టర్ భార్య ఆయేషా మీడియా ముందుకు వచ్చి తన భర్తను సపోర్ట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ఇక ఈ కేసు లో ఆమె భాధితురాలుగా ఉందని పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.. ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.