Rajendra Prasad : తెలుగు నటుడు, హీరో రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. ఆయన గారాల పట్టి కూతురు గాయత్రి గుండెపోటు తో మరణించారు. నిన్న సాయంత్రం గాయత్రి కి గుండెపోటు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఆమె తుది శ్వాస విడిచారు.. కూతురు మరణం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చిన్న వయసులోనే కూతురు పోగొట్టుకున్న రాజేంద్ర ప్రసాద్ బాధ వర్ణణాతీతం. ఈయనకు ఇద్దరు సంతానం ఒక కూతురు, కుమారుడు ఉన్నారు..
రాజేంద్ర ప్రసాద్ కూతురు మరణ వార్త విన్న సినీ ప్రముఖులు, సన్నిహితులు ఆయనకు ధైర్యం చెబుతున్నారు.. అతి చిన్న వయసులోనే గాయత్రి గుండెపోటుతో మరణించడం కుటుంబ సభ్యులు తీవ్రని విషాదాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఆమె మృత దేహాన్ని ఇంటికి తీసుకురానున్నారు. గాయత్రి కి ఒక కూతురు, మహానటి సినిమాలో చిన్ననాటి సావిత్రి పాత్రను పోషించిన గాయత్రీ కూతురు.. ఆమె భర్త మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో భర్త ఉద్యోగం చేస్తున్నారు. ఈమె ఒక న్యూట్రిషియన్.. రేపు ఆమె సొంత ఊరిలోనే అంత్యక్రియలు జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రేపు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం. ఇండస్ట్రీలోని రాజేంద్ర ప్రసాద్ కు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని సమాచారం..
ఇక రాజేంద్ర ప్రసాద్ సినీ కేరీర్ గురించి అందరికీ తెలుసు.. హీరోగా, సపోర్ట్ రోల్ చేస్తూ ప్రేక్షకులకు మనసును గెలుచుకున్న గొప్ప నటుడు.. ఇప్పుడు ఆయన వయసుకు తగ్గ పాత్రలను చేస్తున్నాడు. ఈ వయస్సులో కూడా సినిమాలే ఊపిరిగా బ్రతుకుతున్నాడు. ప్రస్తుతం ఆయన రెండు మూడు ప్రాజెక్టు లలో నటిస్తున్నారని సమాచారం..