Case Filed on Tamil Actor Thalapathy Vijay: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. ఆల్రెడీ ఏప్రిల్ 19న పలు రాష్ట్రాల్లో మొదటి విడత పోలింగ్ జరిగింది. అందులో తమిళనాడు రాష్ట్రం కూడా ఉంది. అయితే ఇదే క్రమంలో చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో దళపతి విజయ్పై కేసు నమోదైంది. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తమిళనాడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్టార్ హీరో దళపతి విజయ్ రష్యాలో షూటింగ్కి బ్రేక్ ఇచ్చి చెన్నై వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరి డైరెక్ట్గా నీలాంగరై పోలింగ్ బూత్కు చేరుకున్నారు. ఇక అతడిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పరుగులు తీశారు. పోలింగ్ బూత్ వద్ద విజయ్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఎడబడ్డారు. అయితే ఈ పోలింగ్ బూత్ వద్దకు విజయ్తో పాటు ఆయన అనుచరులు, మద్దతుదారులు దాదాపు 200 మందికి పైగా వచ్చారు.
దీంతో ఓ వైపు అనుచరులు, మద్ధతుదారులు.. మరోవైపు అభిమానుల హడావుడితో అక్కడ అంతా గందరగోళంగా మారింది. అదే క్రమంలో అక్కడ ఓటు వేయడానికి వచ్చిన సాధారణ ఓటర్ల సైతం తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. అయితే ఇదే విషయమై సెల్వం అనే వ్యక్తి.. హీరో విజయ్పై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. విజయ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాడని ఫిర్యాదు చేశాడు.
Also Read: దళపతి విజయ్ పార్టీ పేరులో మార్పులు.. కారణం ఏంటంటే?
విజయ్ వల్ల తమకు ఇబ్బందికలిగిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. విజయ్ ఎన్నికల నియమాళిని ఉల్లంఘించడంతో పాటు 200 మందితో పోలింగ్ కేంద్రలోకి వెళ్లారని కమిషనర్కు ఫిర్యాదు చేశాడు. దీంతో అందుకు సంబంధించిన వార్త బయటకొచ్చి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై విజయ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. కాగా విజయ్ ఇటీవలే ‘కళుగు’ అనే పేరుతో ఓ పార్టీని పెట్టిన సంగతి తెలిసందే.