Tollywood celebrity news: ప్రతి ఒక్క మనిషిలో ఒక వ్యసనం ఉంటుంది. కొంతమందికి మద్యం.. ఇంకొంతమందికి సిగరెట్.. మరికొంతమందికి పేకాట.. ఇంకొంతమందికి బెట్టింగ్. ఏపీ ఎన్నికల రిజల్ట్స్ మీద కోట్లలో బెట్టింగ్ జరిగిన విషయం తెల్సిందే.
చాలామంది కూటమి గెలుస్తుందని బెట్ కడితే.. వైసీపీ అభిమానులు మాత్రం వైసీపీనే గెలుస్తుందని పందెం కట్టారు. ఇక నిన్న రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది తెల్సిందే. కూటమి మీద బెట్ కట్టినవాళ్లు పండగ చేసుకుంటుండగా.. వైసీపీ మీద పందెం కాసినవాళ్లు లబోదిబో మంటున్నారు.
అలా వైసీపీ మీద పందెం కట్టి ఒక బడా నిర్మాత రూ. 5 కోట్లు పోగొట్టుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఆ బడా నిర్మాత పేరు బయటపడలేదు కానీ, ఎన్నికలు పూర్తయిన వెంటనే సదురు నిర్మాత.. వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని, అది కూడా అత్యధిక సీట్లతో వస్తుందని రూ. 5 కోట్లు పందెం కట్టాడట.
చివరికి వైసీపీ 11 స్థానాలను మాత్రమే దక్కించుకోవడంతో మింగుడు పడక.. డబ్బులు పోయినా పర్లేదు అని గుమ్మనంగా బయట తిరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో ఆ నిర్మాత ఎవరు అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు. కొంతమంది కోన వెంకట్ అంటుండగా.. ఇంకొంతమంది దిల్ రాజు అని చెప్పుకొస్తున్నారు. నిజం చెప్పాలంటే.. కోన వెంకట్.. వైసీపీ తరపున ప్రచారం కూడా చేశాడు. ఈసారి కచ్చితంగా వైసీపీ గెలుస్తుందని చెప్పుకొచ్చాడు. ఒకవేళ కోనా నే ఈ బెట్ కట్టి ఉంటాడని అంటున్నారు. ఇందులో నిజం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.