485 Posts are Vacant in Singareni: సింగరేణిలో 485 ఉద్యోగాలు భర్తీకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 317 డైరెక్ట్, 168 ఇంటర్నల్ పోస్టులు మొత్తం 485ను భర్తీ చేయనున్నట్లు సీఎండీ బాలరామ్ నాయక్ తెలిపారు. కార్మికులు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబానిక రూ.కోటి ప్రమాద బీమా ఇవ్వాలని ఈ ప్రమాద బీమాపై యూబీఐతో ఒప్పుదాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.
ఇంకా వివిధ అంశాలపై సింగరేణి డైరెక్టర్లతో సమవేశలు జరిపి చర్చించినట్లు బలరామ్ నాయక్ తెలిపారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణిని సమీక్షించారు. అక్కడి అభివృద్ధి, సంక్షేమంపై అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం వెయ్య వారసత్వ ఉద్యోగాలు సింగరేణిలో ఇవ్వాలని సూచించారు.
Read More: యుద్ధం మిగిలే ఉంది.. టార్గెట్ 14 ఎంపీ సీట్లు..
హైదరాబాద్లో సింగరేణికి అతిథిగృహం నిర్మంచాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే ఈ అతిథిగృహానికి భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. వయోపరిమితి కూడా 40కి పెంచాలన్నారు. కొత్తగూడెంలో ఫిబ్రవరి 26న 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ప్రారంభించనున్నారని తెలిపారు.