Manchu Vishnu Elected as 2nd Time President for MAA: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రెండు సంవత్సరాలకు ఒకసారి ‘మా’ ఎన్నికలు జరుగుతాయి. అయితే ప్రతిసారి ఎంతో ప్రశాంతంగా ఈ ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. కానీ 2019, 2021లో మాత్రం ఈ ఎన్నికలు గొడవలతో జరిగాయి. గత ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ పోటీ పడగా సంచలనంగా మారాయి.
ఆ మధ్య ఈ ఎన్నికల హడావుడి ఏకంగా అసెంబ్లీ ఎన్నికలను తలపించినంత రణరంగ జరిగింది. టాలీవుడ్లో ఒక యుద్ద వాతావరణమే నెలకొంది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ఎన్నికల గురించే మాట్లాడుకున్నారు.
దీనిబట్టి చూస్తే ఏ స్థాయిలో ఈ ఎన్నికలు జరిగాయో అర్థమయ్యే ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం ఎలాంటి రచ్చలు, ఎలాంటి గొడవలు లేవు. అంతా ప్రశాంతంగా జరిగాయి. మరోసారి మంచు విష్ణుకే ‘మా’ పగ్గాలు అప్పగించారు. 26 మంది కమిటీ సభ్యులు మంచు విష్ణుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎలక్షన్ లేకుండానే, ఎలాంటి గొడవలు జరగకుండానే సైలెంట్గా క్లోజ్ చేశారు.
Also Read: ఎంగేజ్మెంట్ అయ్యాక ఇష్టం లేదని చెప్పి.. నా హృదయాన్ని ముక్కలు చేసాడు..
మరోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికవగా.. రఘు బాబు జెనరల్ సెక్రెటరీగా, కరాటే కళ్యాణి జాయింట్ సెక్రటరీగా, శివ బాలాజీ ట్రెజరర్గా, మధుమిత, శైలజ, జయ వాణి ఈసీ మెంబెర్స్ గా ఎన్నికయ్యారు. కాగా ఈ రెండు సంవత్సరాలలో మంచు విష్ణు పనితీరు పై లైఫ్ మెంబర్స్ ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాకుండా ‘మా’ అసోషియేషన్ నూతన భవనం నిర్మించే వరకు విష్ణునే అధ్యక్షుడిగా ఉంటారంటూ ప్రకటించారు.