సెలబ్రిటీల విషయంలో ఏం జరిగినా అది వైరల్ అవుతుంది. ఈ సంవత్సరం కొందరు సెలబ్రిటీలకి బాగా కలిసి వచ్చింది . అప్పటివరకు అసలు పెళ్లి చేసుకుంటారు అన్న ఆలోచన కూడా లేని వారు కూడా వివాహ బంధంలో ఒకటయ్యారు. అలా ఈ సంవత్సరం పెళ్లిళ్లు చేసుకొని సాలిడ్ గా సెటిల్ అయిన ఆ సెలబ్రిటీ కపుల్స్ ఎవరో ఓ లుక్కేద్దాం పదండి..
మంచు మనోజ్ – భూమా మౌనిక:
మంచి ఫ్యామిలీలో ఎంతో కొంత మంచి ఫాలోయింగ్ ఉన్నట్టుడు మంచి మనోజ్. ఇతని మొదటి పెళ్లి పెద్దగా సక్సెస్ కాలేదు. 2017లో ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకున్న మనోజ్ 2019లో విడాకులు తీసుకున్నాడు. ఇక తర్వాత నుంచి భూమా మౌనిక , మంచు మనోజ్ గురించి అప్పుడప్పుడు గాసిప్స్ వస్తుండేవి. ఇద్దరు పలు సందర్భాలలో కలిసి కనిపించడం ఈ గాసిప్స్ కు మాంచి బూస్ట్ ఇచ్చింది. ఈ పుకారులకు ఫుల్ స్టాప్ పెడుతూ మనోజ్ ఈ సంవత్సరం మార్చి లో వివాహం చేసుకున్నాడు. మౌనిక కు కూడా ఇది సెకండ్ మ్యారేజ్ కావడం విశేషం. ఈ ఇద్దరి పెళ్ళి సన్నిహితుల మధ్య మంచు లక్ష్మి నివాసంలో జరిగింది.
శర్వానంద్ – రక్షిత రెడ్డి:
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న యంగ్ హీరో..శర్వానంద్ జూన్ నెలలో రక్షిత రెడ్డి ని పెళ్ళి చేసుకున్నాడు. ఈ ఇద్దరు రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొని ఆ తర్వాత హైదరాబాద్ లో అందరికీ రిసెప్షన్ ఇచ్చారు.
వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి:
మిస్టర్ చిత్రంతో ఏర్పడిన పరిచయం మెల్లిగా ప్రేమగా మారడంతో.. ఆరు సంవత్సరాల పాటు సైలెంట్ గా లవ్ బర్డ్స్ లాగా గడిపిన ఇద్దరు.. నంబర్ 1 న ఇటలీ వేదికగా ఒకటయ్యారు. అనంతరం టాలీవుడ్ సెలబ్రిటీలు , బంధుమిత్రుల కోసం హైదరాబాదులో గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు.
అభిరామ్ – ప్రత్యూష:
దగ్గుపాటి కొర హీరో.. అహింస మూవీతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన దగ్గుపాటి అభిరామ్.. దగ్గర బంధువు వరసకు మరదలు అయిన ప్రత్యూష ను శ్రీలంకలో పెళ్ళి చేసుకున్నాడు.
అమలాపాల్- జగత్ దేశాయ్:
కోలీవుడ్ టాలీవుడ్ హీరోయిన్గా పాపులారిటీ అయిన అమలాపాల్ ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ ని నవంబర్ 5వ తేదీన రెండవ వివాహం చేసుకున్నది.