Tirumala:తిరుమల శ్రీవెంకటేశ్వరుడ్ని కోట్లాదిమంది అచెంచెల భక్తితో కొలుస్తుంటారు. వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఏడుకొండల స్వామిని దర్శించుకుని తరిస్తుంటారు. ఏ స్థాయి వీవీఐపీలు వచ్చినా…తిరుమలలో దిగి కొండపైకి వాహనంపై రావాల్సిందే. అలాంటి తిరుమల శ్రీవారు కొలువైన కొండపైన ‘నో ఫ్లై జోన్’గా ఉంది. ఆ కొండ పైనుంచి విమానాలు, హెలికాప్టర్లకు ఎగిరేందుకు అనుమతి ఉండదు. ఆగమశాస్త్రం ప్రకారం కూడా శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి అనుమతి లేదు
ఆలయానికి సమీపంలో విమానం చక్కర్లు కొట్టడం ఆగమ విరుద్దమని పండితులు చెబుతున్నారు. కొండపై దేవతలు సంచరిస్తుంటారని భక్తుల నమ్మకం. అందువల్ల విమానాలు తిరిగితే అపచారం అవుతుందని బలంగా విశ్వసిస్తుంటారు.ఆగమ నిబంధనల ప్రకారం ఏడుకొండలప కొలువ దీరిన వెంకటేశ్వరుని పరిసరాల్లో దేవుడి సంచరిస్తాడని అందుకే ఆ ప్రాంతాన్ని నో ప్ల్లైజోన్ ప్రకటించాలని టీటీడీ కేంద్రాన్ని కూడా కోరింది.సైన్స్ ప్రకారం చూసినా ఈ కొండపై పాజిటివ్ వేవ్ ఎక్కువ ఉంటుంది. అందుకే విమానాలింటివి ఎగిరితే పేలిపోయే ప్రమాదం ఉందని అంటారు . బ్రిటిష్ హయాంలో ఇలాంటివి ఘటనలు జరిగినట్టు ఆధారాలున్నాయి.