Donation : ఎవరిని ఇబ్బంది కలిగించకుండా బ్రాహ్మణుడి నే స్వయం గా తయారు చేసుకోమని ప్రార్ధిస్తూ,… బియ్యం,చింతపండు,పప్పులు, బెల్లం,గట్టి ఉప్పు, ఎండు మిరపకాయలు, నెయ్యి, పెరుగు ….. ఇలా భోజనానికి సరిపడా అన్ని పదార్ధాలు ఒక ఆకులో పెట్టి పైన ఇంకొక ఆకు బోర్లించి ఇవ్వాలి. కూరగాయలతో పాటు తోటకూర తప్పనిసరిగా వుండాలి అని చెప్తారు మన పెద్దలు. ఇవే కాకుండా దానం చేసుకోవడానికి ఏ వస్తువూ అనర్హం కాదు. విస్తరి లో బియ్యం కనీసం 1-1/4 కేజీ ఉండాలి . తీపి గుమ్మడి కూడా ఇవ్వొచ్చు.మధ్యలో రెండు తమలపాకులు,వక్కలు నల్లవి,రెండు అరటిపండ్లు ,తాంబూలం మీకు తోచిన దక్షిణ ఉంచి వారికి అందించాలి..దానితో వారు కూడా ఎంతో సంతసించి మీకు మీ కుటుంబానికి మంచి జరగాలని ఆశీర్వచమ్ పలకాలి.
సౌఖ్యమైన జీవనం కోసం మంచి గుమ్మడి పండు దానం చేసుకోవచ్చు,అన్ని కలగా పులగంగా కలిపేసి ఇవ్వకుండా వేటికీ అవి ప్రత్యేకం గా ఒక కవరులాంటి దాంట్లో వేసి ఇస్తే వస్తువులు పాడుకాకుండా ఇంటికి తీసుకువెళ్లి వంఫుకుంటారు….విస్తరిలో అన్ని ఉంచిన తరువాత బియ్యం పిండితో చేసిన దీపాన్ని ఉంచి ప్రత్యేకం గా కార్తీక మాసం లోదీప దానం కూడా చెయ్యొచ్చు.దానికి విశేషధ ఫలితం పొందుతారు.
మహాలయ అమావాస్యగా చెప్పుకునే పితృ పక్షంలో పెద్దల పేరు మీద ఈ కొన్ని దానాలు చేస్తే.. పితృ శాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అంటారు. ఈ రోజుల్లో మన పూర్వీకులకు మోక్షం కలిగించడానికి కొన్ని నియమాలు పాటిస్తాం