Mahalaya 2024 Date: ప్రతీ ఏడాది వచ్చే పితృ పక్షం ఇప్పటికే ప్రారంభమైంది. 16 రోజుల పాటు పాటించే పితృ పక్షం సమయంలోనే చాలా రకాల పవిత్రమైన పండుగలు వచ్చేశాయి. ముఖ్యంగా దుర్గా పూజా పండుగ అంటే నవరాత్రులు కూడా పితృపక్షంలోనే ప్రారంభం కానున్నాయి. ఈ ముఖ్యమైన పండుగ మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సూచిస్తుంది. నవరాత్రులను విజయానికి చిహ్నంగా, చెడుపై మంచి గెలుపును సూచిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం, మహాలయ అమావాస్య అనేది కైలాసగిరి పర్వతం నుండి దుర్గాదేవి ప్రయాణాన్ని సూచిస్తుంది. శివునితో కలిసి మాతృ ఇంటికి అంటే భూమిపైకి విచ్చేస్తుంది. అందువల్ల దుర్గా పూజ ఉత్సవాలకు ఒక వారం ముందు, మహాలయ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఈ పవిత్రమైన రోజు చెడుపై మంచి శాశ్వతమైన విజయాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ పవిత్ర పండుగ తేదీ, ప్రాముఖ్యత వివరాలు ఇవే
పంచాంగం ప్రకారం, మహాలయ అమావాస్య అక్టోబర్ 2 వ తేదీన రానుంది. అమావాస్య తిథి అక్టోబర్ 1 వ తేదీన రాత్రి 09:39 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 2 వ తేదీన మధ్యాహ్నం 12:18 గంటలకు ముగుస్తుంది.
మహాలయ అమావాస్య ఎందుకు జరుపుకుంటారు?
మహాలయ అమావాస్య అనేది దుర్గా పూజ వేడుకల ప్రారంభాన్ని సూచించే పవిత్ర హిందూ పండుగ అని అర్థం. పితృ పక్షం తర్వాత వచ్చే అమావాస్య నాడు, కైలాస పర్వతం నుండి భూమిపై ఉన్న తన తల్లి ఇంటికి దుర్గాదేవి వచ్చినట్లు చరిత్ర చెబుతుంది. రాక్షసుడైన మహిషాసురుడిపై దుర్గాదేవి సాధించిన విజయాన్ని గుర్తుచేసుకుంటూ, చెడుపై మంచి సాధించిన విజయంగా ఈ పవిత్రమైన రోజు సూచిస్తుంది. మహాలయ అమావాస్య నాడు కూడా పూర్వీకులకు నివాళులు అర్పిస్తారు. వారి ఆశీర్వాదం కోరుకుంటారు. ప్రార్థనలు చేస్తారు మరియు దుర్గా రక్షణ, మార్గదర్శకత్వాన్ని ప్రార్థిస్తూ శ్లోకాలు పఠిస్తారు. ఈ పండుగ ఆధ్యాత్మిక వృద్ధిని ప్రతిబింబిస్తుంది. విశ్వాసం, భక్తి మరియు సాంస్కృతిక ఉత్సాహంతో కూడిన ఈ వారం రోజులు దుర్గా పూజతో ముగుస్తుంది.
మహాలయ అమావాస్య ప్రాముఖ్యత
హిందూ పంచాంగం ప్రకారం, దుర్గా పూజ వేడుకలకు ఒక వారం ముందు మహాలయ ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన రోజు వివిధ ఆచారాలు పాటిస్తారు. ఈ రోజున ప్రతీ ఒక్కరు పూర్వీకులకు ‘తర్పణం’ నిర్వహిస్తారు. పూర్వీకుల ఆత్మలకు ప్రార్థనలు చేసి వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు. బ్రాహ్మణులకు ‘భోగ్’, అలాగే అవసరమైన వారికి ఆహారం మరియు అవసరమైన వస్తువులను అందిస్తారు. చాలా మంది గౌరవనీయమైన మహిషాసురమర్దిని కూర్పును కూడా వింటారు. ఇది దుర్గా దేవి యొక్క సాంప్రదాయ ఆవాహన అని నమ్ముతారు.
మహాలయ నాడు ముఖ్యంగా బెంగాలీ కుటుంబాలు తెల్లవారుజామున లేచి, రోజు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను స్వీకరిస్తాయి. అనేక హిందూ గృహాలలో, పితృ తర్పణం ఆచారం పాటిస్తారు. పూర్వీకులకు పిండ-దానం సమర్పణల ద్వారా నివాళులర్పించేందుకు గంగా నది ఒడ్డున చేరుతారు. ఈ వేడుక మరణించిన వారిని గౌరవిస్తుంది. వారి ఆశీర్వాదం మరియు శాంతిని కోరుకుంటుంది. ఈ కాలాతీత సంప్రదాయాల ద్వారా, మహాలయ తరతరాల మధ్య శాశ్వతమైన బంధానికి మరియు చెడుపై మంచి సాధించిన విజయానికి పని చేస్తుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)