Bath without water : స్నానం అంటే నీళ్లతోనే మాట వినడం సహజమైంది. ఒంటిని శుభ్రపరుచుకునేందుకు నీళ్లతో స్నానం ప్రతీ ఒక్కరు చేస్తుంటారు. మలినాల నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు వేడి నీళ్లతో కానీ, చన్నీళ్లతో కానీ స్నానం చేస్తుంటారు. అసలు నీళ్లు లేకుండా స్నానం చేయచ్చా అనే వారికి సమాధానం ఇది. హోమ భస్మాన్ని ఒంటి నిండా పూసుకుంటే అది విభూది స్నానం. విబూది కూడా ఒక రకంగా బూడిదే. ఏదైనా వస్తువు కాలిపోతే మిగిలేది బూడిదే. నీరు కూడా ఒక రకంగా బూడిదలాంటిదే. బూడిద లేదా విబూతి స్నానంతో చర్మవ్యాధులు తగ్గించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. టెంపరేచర్ ను కంట్రోల్ చేస్తుంది.
మట్టితో చేసే స్నానం చేస్తుంటారు. దీన్ని మడ్ బాత్ అంటారు. మట్టితో చేసే స్నానం ఆరోగ్యాన్నికి మంచిదని శాస్తీయంగాను నిరూపితమైంది. మట్టితో స్నానం చేసి ఎండలో నిలబడి ఆరాక దేహాన్ని శుభ్రం చేసుకోవడాన్ని మృత్తిక స్నానం అంటారు. ప్రకృతి వైద్యంలో మట్టి స్నానానికి విశేష స్థానం ఉంది. మట్టికి మనిషికి విడదీయరాని బంధం. మనిషి చనిపోయాక చేరిది ఈ మట్టిలోనే. బంకమట్టితో స్నానం 20 నుంచి 30 నిమిషాలు చేస్తే కొన్ని రకాలు ఆరోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చని ప్రకృతి వైద్యం చెబుతోంది.
గాలితో స్నానం కూడా చేయచ్చు. అది ఎలా అంటే హిందువులు పరమ పవిత్రంగా నడిచే గోవుల కాళ్ల నుంచి ఎగిసిపడే మట్టి ద్వారా సాధ్యం అవుతుంది. గోధూళితో స్నానం పవిత్రమైనదని కొన్ని పురాణాల్లో ప్రస్తావించారు. ఒక్కోసారి వాతావరణం విచిత్రంగా మారిపోతుంది. ఒక వైపు ఎండ మరో వైపు వాన పడుతుంది. చాలా కొన్ని సార్లు మాత్రమే జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో స్నానం కూడా చేయచ్చు. ఎండ, వాన మధ్యల చేసే స్నాన్ని దివ్య స్నానంగా చెబుతారు. ఇలాంటి స్నానాలు గురించి ఎన్ని చూపినా మనస్సుద్ది అయితేనే దేహశుద్ధి అవుతుంది.