Tirumala : ఫిబ్రవరి చివరి వారానికి సంబంధించి వివిధ రకాల ఆర్జిత సేవా టికెట్ల ఆన్ లైన్ కోటాను టీటీడీ గురువారం విడుదల చేయనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచుతుంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆన్లైన్ ఆర్జిత సేవలు.. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను టీటీడీ విడుదల చేస్తుంది. ఈ సేవల ద్వారా లభించే దర్శన టికెట్లను ఫిబ్రవరి 9న ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో అందుబాటులో ఉంచుతారు. ఎలక్ట్రానిక్ డిప్ లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నమోదు కోసం ఫిబ్రవరి 8 ఉదయం 10 గంటల నుంచి ఫిబ్రవరి 10 ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుంది.
ఇతర ఆర్జిత సేవా టికెట్లను ఫిబ్రవరి 8న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్లైన్ లో అందుబాటులో ఉంచుతారు.
భక్తులు http://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఆర్జిత సేవా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.