Tirumala Darshnam tokens : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను గురువారం అంటే ఈ నెల 12 న టీటీడీ జారీ చేయబోతోంది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లో ఎప్పటిమాదిరిగానే ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేస్తారు . సామాన్య భక్తుల కోసం గతంలో ఆఫ్ లైన్ ఇచ్చే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను కొంతకాలంగా ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి 1 నుంచి 11 వరకు టోకెన్లను టీటీడీ జారీ చేసింది. ఇప్పుడు పెండింగ్లో ఉన్న వాటిని 12వ తేదీ నుంచి టోకెన్లను విడుదల చేస్తోంది. తిరుమల వెళ్లాలనుకునే భక్తుల ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ నెల 31వ తారీఖు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి రోజువారిగా 20 వేల చొప్పున జనవరి 9 నుంచి అనగా జారీ చేస్తున్నారు. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ లింక్లో టికెట్ పొందవచ్చు.