Pooja Room : మనిషి శరీరానికి గుండె ఎంత ముఖ్యమో ఇంటికి పూజ గది అంత అవసరమైంది. మన కష్టాలు, బాధలు,కోరికలు చెప్పుకునేది అక్కడే . మనశ్శాంతిగా పూజ చేసేది కూడ ఈగదిలోనే. అలాంటి పవిత్రమైన గదిలో ఏ వస్తువున ఉంచాలో కాదు ఏ వస్తువును ఉంచకూడదో తెలుసుకుంటే మంచిది. పెట్టకూడని వస్తువుల్ని పూజా మందిరంలో పెట్టడం వల్ల మనకి నష్టం జరుగుతుంది. ఎన్ని పూజలు చేసిన ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేదని కొందరు బాధపడుతుంటారు.అలాంటి వారు తెలియక చేసే చిన్న తప్పుల వల్ల దేవుడు పూజా మందిరం నుంచి విడిచిపోతాడు. దాని వల్ల దేవుడి లేని దేవాలయం మాదిరిగా తయారవుతుంది.
పూజా మందిరంలో దైవశక్తి ఉండాలంటే దివంగతుల ఫోటోలు ఉంచకూడదు. అంటే చనిపోయిన వారి ఫోటోలను దేవుళ్ల పటాలతో కలిపి పెట్టకూడదు.
ఎందుకంటే పితృదేవతలు ఉన్న చోట దేవతలు ఉండరు . దేవతలు ఉండే స్థానంలో పితృదేవతలు రారు. పిృత సంబంధిత కార్యాలు చేసే సమయంలో తోరణాలు లాంటివి ఇంటికి కట్టే ఆచారం ఉండదు. అలాగే ముగ్గులు కూడా వేయరు. పూజా గదిలో ఇనుప సామాన్లు ఉంచకూదదు. సుత్తి లేదా కత్తి లాంటివి కూడా ఉంచకూడదు. ఇనుప వస్తువులు ఉన్న చోట దరిద్ర దేవతలు మాత్రమే ఉంటారట..
డ్యామేజీ అయిన చిత్రపటాలను పూజా గది నుంచి తొలగించాలని. అద్దాలు పగిలిపోయి ఉన్నా కొన్ని పటాలను అలాగే పూజిస్తుంటారు . సెంటిమెంట్ పేరుతో అలాంటి వాటిని ఉంచితే మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. దేవుడి విగ్రహాలు, ఫోటోలను తుడవటానికి చిరిగిపోయిన, లేదా పాత బట్టలు వాడకూడదు. చిరిగిపోయి వస్త్రాలను పూజా మందిరంలో అసలు ఉంచకూడదు. ఒకవేళ అలాంటివి ఉంచితే అక్కడ నుంచి లక్ష్మీదేవి వెళ్లపోతుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అలాగే ఒకరక