Puja Rules : భారతదేశంలోని సనాతన సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు విధానాలు ఉన్నాయి. స్నానం చేయకుండా పూజ చేయకూడదా అని కొందరు ప్రశ్నిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ సమాధానం. దీపారాధన వల్ల నాకు కలిగి ప్రయోజనమేంటి..అని మనిషి తనను తాను ప్రశ్నించుకోవాలి. ఉదయం లేవగానే మనం నాలుగు విషయాలు ఆలోచించాలి.
1.నేను పాటించాల్సిన ధర్మమేంటి…?
2.ఈపూట గడపటానికి కావాల్సిన డబ్బు ఎలా వస్తుంది.. .?
3.ఇవాళ చేయాల్సిన పనేంటి..పొందాల్సిన ఫలితమేంటి .?
ఈ నాలుగు ప్రశ్నలు వేసుకుని మనం జీవితాన్ని ప్రారంభించాలి. అంతేకాని ఊరికే లేచి..హడావుడిగా స్నానం చేసి యాంత్రికంగా పరిగెట్టకూడదని సనాతన ధర్మం చెబుతోంది. ప్రతీ రోజుకిఒక షార్ట్ టర్మ్ గోల్ ఉండాలి. అలాగే జీవితం మొత్తానికి లాంగ్ టెర్మ్ గోల్ ఉంటుంది. ఈ లక్ష్యాలను సాధించడమే మనిషి లక్ష్యం. ఈ లక్ష్యాలను సాధించాలంటే మనిషికి బలం కావాలి. దైవబలానికి మించిన బలం లేదని చాణిక్యుడు నీతిశాస్త్రంలో చెప్పాడు.
ఆ దైవబలం కోసమే ప్రతీ మనిషి ఉదయమే లేచి స్నానం చేసి దైవారాధన చేయాలి. ఈ స్నానాల్లో ఆరు రకాలు ఉన్నాయి. మనిషి శరీరం కూడా ఫ్యాక్టరీలో లాంటిది. రకరకాల మలిన్నాల్ని వదులుతుంది. శరీర శుద్ధి కోసమే స్నానం చేస్తాం. ఒకవేళ శరీర సహకరించలేని వాళ్లు దీపారాధన చేయాలంటే…పూజ తప్పని సరా…అంటే శాస్త్రాలు కొన్ని మినహాయింపులు ఇస్తున్నాయి . ఒంటిని తడిగుడ్డతో తుడుచుకుని ఆచమనం చేయాలి. నీళ్లను చల్లుకుని పుండరీకాక్ష అని మూడుసార్లు మంత్రం జంపించి బొట్టు పెట్టుకుని పూజను చేయవచ్చని చెబుతున్నాయి.