Navpancham yog: నిర్ధిష్ట సమయం తర్వాత గ్రహాలు రాశులను మర్చుకుంటాయి. గ్రహాల రాశి మార్పు 12 రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. ఈ క్రమంలో అక్టోబర్ 17వ తేదీ ఉదయం 7.27 గంటలకు గ్రహాల రాజు సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించాడు. అదే సమయంలో, కర్మను ఇచ్చే శనిదేవుడు ఇప్పటికే తులారాశిలో ఐదవ ఇంట్లో ఉన్నాడు.
శని, సూర్యుడు కలిసి తులారాశిలో నవపంచం రాజయోగాన్ని సృష్టిస్తున్నారు. ఇది మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. వీటిలో, సూర్యుడు, శని కలయికతో ఏర్పడిన నవపంచమ రాజయోగం వల్ల 3 రాశుల వారు అధిక ప్రయోజనాలు పొందుతారు. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
నవపంచమ యోగం వల్ల మేష రాశి వారు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. ఈ వ్యక్తులు వారి కెరీర్లో పురోగతి సాధించడానికి కొత్త అవకాశాలను పొందుతారు. మీరు మీ కష్టానికి పూర్తి ఫలితాలు పొందుతారు. అంతే కాకుండా ఈ సమయంలో మీ అదృష్టం పెరుగుతుంది. వ్యాపారంలో విస్తరణకు అన్ని అవకాశాలు ఉన్నాయి. కొత్త ఒప్పందాలు జరుగుతాయి. వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. అంతే కాకుండా మీ పనులు ఈ సమయంలో విజయవంతం అవుతాయి. ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు.
వృషభ రాశి :
వృషభ రాశి ఉద్యోగస్తులకు నవపంచం రాజ్యయోగ ప్రభావం వల్ల ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభిస్తుంది. ఇంతకుముందు కంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. డబ్బును పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలను పొందవచ్చు. ఉద్యోగంలో సీనియర్ల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పురోగతికి బలమైన అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా అనేక కార్యక్రమాల్లో విజయాలను అందుకుంటారు. కెరీర్ పరంగా శుభ వార్తలను అందుకుంటారు. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు.
Also Read: దీపావళి రోజు ఏ నూనెతో దీపాలు వెలిగించాలి.. పాటించాల్సిన ఆచారాలు ఏమిటి ?
తులా రాశి:
నవపంచం రాజయోగం తులా రాశి వారి జీవితాల్లో సానుకూల ఫలితాలను తెస్తుంది. వీరికి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక సంక్షోభం సమసిపోయేలా కనిపిస్తుంది. వ్యాపారంలో ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా పాత వ్యాధి ముగిసి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది. అంతే కాకుండా మీరు ఉన్నత స్థానంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.