Mars Transit 2024: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రతి గ్రహం కొన్ని రోజులకు రాశి మారుతుంటుంది. మేషం, వృశ్చిక రాశులకు అధిపతి అయిన కుజుడు ఆగస్టు 26న కృష్ణాష్టమి రోజున రాశిమారనున్నాడు. కుజుడు మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అలాగే గ్రహాల అధిపతి అయిన బుధుడు కూడా మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో కొన్ని రాశులవారికి విశేష ప్రయోజనాలు లభించనున్నాయి. కొన్ని రాశులవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
ఎవరి జాతకంలోనైనా కుజుడు బలంగా ఉంటే.. విజయం అనితరసాధ్యమవుతుంది. సంపద పెరుగుతుంది. కుటుంబ సంబంధాలు బలపడుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మరి ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.
Also Read: బుధాదిత్య రాజయోగం.. ఈ 5 రాశులవారికి వారంరోజులు పట్టిందల్లా బంగారమే..
మేషరాశి
కుజుడు రాశి మారుతుండటం ఈ రాశివారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఆత్మవిశ్వాసం, బలం, ధైర్యం పెరుగుతాయి. తోబుట్టువులతో బంధం బలపడుతుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. ధార్మిక, ఆధ్యాత్మిక పనుల పట్ల శ్రద్ధ చూపుతారు. విదేశీ కంపెనీలో పనిచేసే అవకాశం లభిస్తుంది.
సింహరాశి
ఈ రాశివారికి కూడా కుజ రాశి మార్పు కలిసి వస్తుంది. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పై అధికారులతో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి. నిరుద్యోగం నుంచి విముక్తి కలుగుతుంది. కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. అన్నీ మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్యారాశి
కన్యారాశివారికి గౌరవం లభిస్తుంది. అదృష్టం పెరుగుతుంది. రాజకీయాల్లోకి వెళ్లాలనుకునేవారికి ఇదే మంచి సమయం. ఉద్యోగార్థులు లాభపడతారు. విద్యార్థులు విదేశాల్లో చదువుకునే అవకాశం లభిస్తుంది. ఆర్థికంగా బలం చేకూరుతుంది. పిల్లల పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనికి ఎలాంటి బాధ్యత వహించదు.)