Shani Thrayodashi : హిందూమతంలో శనిదోష నివారణ పూజలకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. శని త్రయోదశి రోజు శని వజ్ర పంజర స్త్రోతాన్ని భక్తితో పటిస్తే శనికి సంబంధించి దోషాలు పోతాయన్న విశ్వాసం ఉంది. ఏదైనా శనివారం రోజు లేదా శనిత్రయోదశి నాడు ఈ స్తోత్రాన్ని పఠించాలని శాస్త్రం చెబుతోంది. శనీశ్వరునికి సంబంధించిన ఆరుకవచ శ్లోకాలు ఉంటాయి. వీటిని భక్తితో స్మరిస్తే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది.శని వజ్ర పంజర శ్లోకానికి సంబంధించి బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావించారు.
ఈ శ్లోకాన్ని చదివిన వారికి శనిపీడ ఉండదు. సూర్యభగవానుడే స్వయంగా రక్షణ కవచాన్ని ఇచ్చాడని పురాణం చెబుతోంది. సూర్యభగవానుడి పుత్రుడు శనేశ్వరుడు . కొడుకు ఎలాంటి పదాలకు ప్రసన్నం అవుతాడో తండ్రికి తెలుసు అందుకే సూర్యభగవానుడు ఈ కవచాన్ని ఇచ్చాడట.
శనిపీడ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అనారోగ్య రూపంలో వేధిస్తూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు తరచూ వెంటాడుతున్నప్పుడే దోష నివారణ పూజలు చేస్తుంటారు. బతికుండగానే చేసినపాపాలను శనీశ్వరుడు దండిస్తాడు. అందుకే శని దోష నివారణకు ఈ మంత్రాన్ని ఐదు నిమిషాలు రోజు జపిస్తే సమస్యల నుంచి బయటపడవచ్చని శాస్త్రం చెబుతోంది. శనివారం నాడు త్రయోదశి కలిసి వచ్చిన రోజు కావడంతో ఈరోజు శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. లేదంటే నువ్వులు, నల్లటి వస్త్రాలు దానం చేస్తే సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.