Udupi:కర్నాటకలోని ఉడుపి శ్రీకృష్ణ దేవాలయానికే కాక మంచి వంటకాలకు ఫేమస్ . ముఖ్యంగా దక్షిణాది వారు ఏ ప్రాంతానికి వెళ్లినా పనిగట్టుకుని ఉడుపి హోటళ్లను వెత్తుకుంటారు. అసలు ఉడుపి హోటళ్లు ఫేమస్ కావడానికి శ్రీకృష్ణుడి నైవేద్యాలే కారణం. నేటికి ఉడుపి హోటళ్ళు చాలా చోట్ల వివిధ ప్రదేశాలలో కనపడుతూంటాయి. నోరూరించే ఈ శాకాహార వంటకాలను మధ్వ మతం వారు తయారు చేస్తారు. వీరు క్రిష్ణుడి దేవాలయానికి ఎన్నో తరాలనుండి వివిధ వంటలు చేసి నైవేద్యంగా అర్పిస్తున్నారు.
ఉడుపి పట్టణం హిందువుల ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడికి ప్రధానంగా చెపుతారు. ఇక్కడే పొరుగుననే ఉన్న యల్లూరు లో మరో దేవాలయం భగవంతుడు శివుడికి కూడా ఉంది. ఇది సుమారు వేయి సంవత్సరాల నాటిదని చెపుతారు. 13వ శతాబ్దంలో మతాచార్యుడు మధ్వాచార్య ఇక్కడ ఉడుపి కృష్ణ మఠం స్ధాపించారు. ఈ దేవాలయంలో దేవుడి నైవేద్యం కోసం తయారు చేసే ఆహార పదార్దాలను బ్రాహ్మణులు ఎంతో నియమ నిష్టలతో తయారు చేసేవారు. ఈ వంటకాలు క్రమేణా ప్రసిద్ధి చెంది కర్నాటక రాష్ట్రంలోనే కాక, దేశంలోని అని ప్రాంతాలకు విస్తరించాయి.
వీరు తయారు చేసే దోశలు నేటికి ఎంతో ఇష్టంగా అన్ని ప్రాంతాల జనాలకి ఇష్టమైన ఆహార పదార్థంగా మారిపోయాయి. ఉడు …అంటే భగవంతుడు, పా…అంటే నక్షత్రాలని సంస్కృతంలో అర్ధం. ఉడుపి లో కృష్ణ దేవాలయం గురించి అనేక కధలున్నాయి. 16వ శతాబ్దంలో తక్కువ కులాలకు చెందిన కనకదాస అనే భక్తుడు కృష్ణుడి దర్శనం కోరగా అతడ్ని దేవాలయంలోకి రానివ్వలేదు. దేవుడ్ని చూడాలని కనకదాస దేవాలయానికి ఉన్న చిన్న కిటికీ నుండి లోపలికి చూశాడట. అయితే అతనికి క్రిష్ణుడి వీపు భాగం మాత్రం కనపడిందని, అపుడు శ్రీకృష్ణుడు తానే ముందుకు తిరిగి అతడికి దర్శన మిచ్చాడని చెపుతారు.