Intention behind the Parada : ఆలయాల్లో భక్తులు పాటించ వలసిన నియమాలతోపాటు కైంకర్యాలూ పూజల విషయంలో ఆగమ శాస్త్రంలో ఎన్నో విషయాలు చెప్పారు. పూజలు , నివేదన విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో..ఏం చేయాలో.ఏం చేయకూడదో చెప్పారు. అందులో ఒకటి పరదా. దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో పరదా ఆచారం మనం చూస్తూ ఉంటాం. ఏ గుడిలోనైనా సరే ఇది ఒకేలా జరుగుతుంది. ఆలయాల్లో అర్చన సమయంలో జరిగే షఓడశ ఉపచారాల్లో నివేదన ఒకటి.మిగిలిన అన్ని సేవలనూ భక్తులు చూడవచ్చు.చూసి తరించవచ్చు.కానీ నివేదన చేసే వేళ మాత్రం దృష్టి దోషం రాకుండా ఉండాలని ఆగమ సంప్రదాయం చెబుతోంది.
దేవుడికి ఉదయం సుప్రభాత సేవతో పాటు ఎన్నో సేవలు చేస్తుంటారు. వీటన్నింటిని మనం చూస్తూనే ఉంటాం. కానీ, అర్చనలలో జరిగే షోడశ ఉపచారాలలో ఒకటైన నివేదన సమయంలో మాత్రం పరదా వేస్తుంటారు. అందుకు కారణం.. దృష్టి దోషం కలగకుండా ఉండడమేనని ఆగమ సంప్రదాయం చెబుతోంది. దేవునికి నివేదన చేసిన పదార్థం ప్రసాదం అవుతుంది. ఆ సమయంలో దేవుడిని చూడకుండా పరదా వేస్తుంటారు.మన ఇళ్లల్లో చిన్నపిల్లలు సమయంలో కూడా ఇలానే చేస్తారు పెద్దలు. దేవుడికి నివేదన చేసిన పదార్థం ప్రసాదం అవుతుంది. అందుకు నివేదన సమయంలో దృష్టి దోష పరిహారారాథం తెర పెడతారు. అమ్మవారిని అలంకరించేటప్పుడు కూడా తెర వేస్తూ ఉంటారు.
Follow this link for more updates:- Bigtv