Jyeshtha Amavasya 2024: హిందూ మతంలో అమావాస్య తేదీ చాలా ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. పూర్వీకులకు ప్రార్థనలు, దానధర్మాలు చేయడానికి ఈ తేదీ చాలా శ్రేష్ఠమైనది అని నమ్ముతారు. అమావాస్య రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వలన జీవితంలో సుఖం, శాంతి, పుణ్యం లభిస్తుంది. ప్రస్తుతం జ్యేష్ఠ మాసం జరుగుతోంది. ఈ నెల అమావాస్య జూన్ 6వ తేదీన వస్తుంది. ఈ రోజున కొన్ని చర్యలు పాటించడం వల్ల పితృ దోషం నుంచి ఉపశమనం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల నువ్వులు
జ్యేష్ఠ అమావాస్య నాడు పూర్వీకులకు నల్ల నువ్వులను సమర్పించడం చాలా పుణ్యం అని భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, ఇది మోక్షానికి దారితీస్తుంది. అంతే కాకుండా, పవిత్ర నదులలో స్నానం చేసిన తరువాత నల్ల నువ్వులను అందులో వదిలేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. అంతేకాదు వారి అనుగ్రహం కలకాలం నిలిచి ఉంటుందట.
పీపాల్ చెట్టుకు నీరు
విష్ణువు పీపాల్ చెట్టులో నివసిస్తాడు అని ప్రతీ ఒక్కరు భావిస్తారు. అందువల్ల అమావాస్య రోజున పీపల్ చెట్టుకు నీరు సమర్పించడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు.
అమావాస్య నాడు స్నానం చేయడం, దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీని వలన పుణ్యం లభిస్తుంది. గతంలో చేసిన పాపాలు నశిస్తాయి. జ్యేష్ఠ అమావాస్య నాడు మీకు తోచినంత మేరకు దానం చేయండి. ఇలా చేయడం ద్వారా పితృ దోషం నుండి విముక్తి పొంది ఇంట్లో ఆనందం, శాంతి కూడా ఉంటుంది.
శనిదేవుని ఆరాధన
జ్యేష్ఠ అమావాస్య రోజున శని జయంతిని కూడా జరుపుకుంటారు. ఈ రోజు శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఆలయానికి వెళ్లి శనిదేవుడికి ఆవనూనె నైవేద్యంగా పెట్టండి.
జ్యేష్ఠ అమావాస్య శుభ సమయం
హిందూ క్యాలెండర్ ప్రకారం, జ్యేష్ఠ అమావాస్య తిథి జూన్ 5 రాత్రి 07:54 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే జూన్ 6 సాయంత్రం 06:07 గంటలకు ముగుస్తుంది. ఈ కారణంగా, జ్యేష్ఠ మాస అమావాస్య జూన్ 6న ఉంటుంది. ఈ రోజున దానం చేయడం మంచిది.