Night Food : ఎన్ని యజ్ఞాలు చేసినా రాని ఫలితం అన్నదానంతో వస్తుంది. రాత్రివేళ మనం భోజనం చేసిన తరువాత కొద్దిగా అయిన అన్నాన్ని మిగల్చాలి. ఉదయం లేవగానే ఈ అన్నాన్ని వీధులో జంతువులకు, క్రిమికీటకాలకు ఆహారంగా వేయాలని శాస్త్రం చెబుతోంది. ఎవరైనా అన్నం మిగిల్చకుండా ఉంటే ఆ ఇంట్లో మనశాంతి లోపిస్తుంది. కాబట్టి అన్నంతో ఈ విధంగా చేయడం వల్ల మనశ్శాంతిగా , ఆయురారోగ్యాలతో జీవించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.
రోజూ రాత్రి ఒక గుప్పెడు అన్నాన్ని పక్కకు తీసి ఉంచాలి. ఉదయాన్నే ఆ అన్నాన్ని పక్షులకు, క్రిమికీటకాలకు, జంతువులకు ఆహారంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పాపకర్మాలను పోగొట్టుకునే అవకాశం లభిస్తుంది.
అన్నాన్ని కాకులకు వేస్తే శని దోషాల నుంచి బయట పడవచ్చని కూడా చెప్తారు. ఇలాంటి విషయాలు పాటిస్తుంటే మనకు మన ఇంటిల్లిపాదికీ ఆయురారోగ్యాలకి ఎటువంటి లోటూవుండదు. తినే పదార్ధాలని వృధాచేయకుండా సద్వినియోగం చేస్తూ ఉంటే ఆ అన్నపూర్ణమ్మ తల్లి నిత్యం మనింట్లో ధాన్యరాసుల్ని కురిపిస్తుంది
అన్నం పరబ్రహ్మ స్వరూపంగా పోల్చుతారు. అలాంటి అలాంటి అన్నాన్ని ఆకలితో ఉన్న వాళ్లకి దానం చేస్తే తప్పుకాదు. వారి ఆకలిని తీర్చిన వాళ్ల మవుతాం. అన్నం మిగిలిందని బయటపడేయడం లాంటివి చేయకుండా అవసరమైన వారికి దానం చేయాలి.